Share News

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

ABN , Publish Date - May 17 , 2025 | 12:52 PM

గాలి జనార్దన్‌రెడ్డిపై మా పోరాటం ఫలించింది.. అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. అలాగే.. నేను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ భావాలకు వ్యతిరేకిని అని కూడా అన్నారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే..

Siddaramaiah: ‘గాలి’పై మా పోరాటం ఫలించింది

- అక్రమ మైనింగ్‌లో దోషులందరినీ శిక్షించాలి

- బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ భావాలకు వ్యతిరేకిని: సీఎం

బళ్లారి(బెంగళూరు): అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారందరికీ శిక్ష పడాలని, ప్రజల సొమ్ము దోచుకున్నవారిని వదిలి పెట్టరాదని ముఖ్య మంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా విజయనగర జిల్లా హొస్పేట్‌లో ఈ నెల 20న విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పరిశీలించడానికి సీఎం హోస్పేకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం విలేకరులతో మాట్లాడారు...

ఈ వార్తను కూడా చదవండి: Bollywood Stars: కృష్ణ జింక కేసు.. మరోసారి చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్‌


గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) బళ్లారి గనుల్లో అక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి బళ్లారికి 2013లో పాదయాత్ర చేశామన్నారు. బీజేపీ గాలికే మద్దతు ఇచ్చిందని, మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలన్నారు. తాను బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ భావాలకు వ్యతిరేకినన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి గంగావతిలో విజయానికి మీరు సహకరించారని ప్రశ్నించగా ఆయన అవినీతిపై పోరాడిన తాను ఆయనకు ఎలా సహకరిస్తానన్నారు.


పరిపాలనా దృక్పథంతోనే ‘గ్రేటర్‌’

పరిపాలనా దృక్పథంతో అలోచించే గ్రేటర్‌ బెంగళూరు లో మున్సిపల్‌ కార్పొరేషన్లు పెంచే అలోచనలో ఉన్నామన్నారు. బెంగళూరు గ్రేటర్‌లో ఒకటిన్నర కోటి జనాభా ఉంది. ఇందుకు ఒకే నగర పరిపాలను ఒకే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్వహించడం కష్టమన్నారు. పెరిగిన జనాభా దృష్ట్యా మూడు, నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ప్రతిపక్ష నాయకడు ఆర్‌ అశోక్‌ కూడా ఇదే విజ్ఞప్తి చేశారన్నారు. గతంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్‌ కూమార్‌ ఉన్నప్పుడు కూడా ఈ ప్రతిపాదన తెచ్చారని, అందుకు పరిపాలనా దృష్టిలో గ్రేటర్‌ బెంగళూరులో మూడు అంతకన్నా ఎక్కవ మున్సిపాల్టీలు ఏర్పాటు చేయాలనుకున్నట్లు సీఎం అన్నారు.


pandu1.2.jpg

‘బల్డోట’పై నివేదిక ఇవ్వండి: సీఎం

కొప్పళ జిల్లా బల్డోట ఉక్కు కర్మాగారంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కొప్పళ జిల్లా కలెక్టర్‌కు సీఎం సిద్దరామయ్య సూచించారు. బెల్డోటా కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగిస్తుందని ఫిర్యాదులు అందాయన్నారు. కంపెనీ కార్యాకలాపాలను నిలిపి వేయాలని ఆదేశించామన్నారు. కానీ సీఎం మాట లెక్కచేయకుండా కంపెనీ కొనసాగిస్తోందన్నారు. పూర్తి నివేదిక ఇవ్వాలని డీసీని అదేశించారు. ప్రభుత్వం గ్యారెంటీ పథకాల అమలు చేసేందుకు ప్రభుత్వ ఖజానా లో లోటు ఏర్పడిందని అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని నిధులు పుష్కలంగా ఉన్నాయని దాటవేశారు.


విజయనగర జిల్లా హొస్పేట్‌లో ఈనెల 20 జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి ఏఐసీసీ ఆద్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, వివిద రాష్ట్రాల నుంచి అనేక మంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, సుమారు 3 లక్షల మంది కార్యకర్తలు ప్రజలు హజరవుతారని సీఎం తెలిపారు. హొస్పేట్‌లో చక్కెర పరిశ్రమను తిరిగి పునఃప్రారంభిస్తామన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌, మంత్రి హెచ్‌కే పాటిల్‌, జమీర్‌ అమ్మద్‌, ఎమ్మెల్యే గవియప్ప, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

Read Latest Telangana News and National News

Updated Date - May 17 , 2025 | 12:52 PM