India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్పై చైనా గుర్రు.. కారణమిదే..
ABN , Publish Date - May 14 , 2025 | 10:46 AM
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలూ కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు మే 10న ప్రకటించాయి. వాస్తవంగా ఆ సమయంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్కు పాక్ DGMO ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోరారు. అయితే కాల్పుల విరమణ సందర్భంగా అమెరికా, పాకిస్తాన్, చైనా ప్రకటనలు విడుదల చేశాయి. ఆ ప్రకటనల్లో..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరిగిన దాడి, ప్రతిదాడులు చూసి.. పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే భారత్ వరుస దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్.. చివరకు కాళ్ల బేరానికి వచ్చింది. ఉద్రిక్తతలు తగ్గించే క్రమంలో కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్పై చైనా గుర్రాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారత్-పాక్ మధ్య (India Pakistan War) ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు మే 10న ప్రకటించాయి. వాస్తవంగా ఆ సమయంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)కు పాక్ DGMO ఫోన్ చేసి తక్షణ కాల్పుల విరమణ కోరారు. అయితే కాల్పుల విరమణ సందర్భంగా అమెరికా, పాకిస్తాన్, చైనా ప్రకటనలు విడుదల చేశాయి. ఆ ప్రకటనల్లో ఒకదానికి మరొకటి పొంతనే లేకుండా ఉన్నాయి. ప్రపంచ శాంతి దూతగా తనకు తానుగా చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు తెలివిగా వ్యవహరించాయి.. అంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Truth Social లో ముందుగా ప్రకటించారు. మరో వైపు తమ ప్రకటనల తర్వాతే పాక్ డ్రోన్లు భారత్ గగనతలంలోకి రావడం ఆగిపోయానని చైనా రక్షణ నిపుణులు పేర్కొన్నారు. ఇది బీజింగ్ జోక్యాన్ని సూచించే సంకేత చర్యగా భావించాలి.
ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ (Chinese Ministry of Foreign Affairs) మే 12న ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-పాక్ కాల్పుల విరమణను (ceasefire) కొనసాగించాలి.. విబేధాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి.. అంటూ ప్రకటించింది. ఇరుదేశాలతో చైనా సంప్రదింపుల్లో ఉంటుందని, దక్షిణాసియాలో శాంతి కాపాడే ప్రయత్నాలు చేయనున్నట్లు తెలిపింది. అయితే దక్షిణాసియాలో తమ ప్రభావమే ఎక్కువగా ఉంటుందని భావించే చైనా.. క్లిష్ట సమయంలో పాకిస్తాన్ను బీజింగ్ను సంప్రదించాల్సింది పోయి.. వాషింగ్టన్ను సంప్రదించడంపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బీజింగ్.. ఇస్లామాబాద్కు ఫోన్ చేసింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలను గమనిస్తే.. ట్రంప్ (US President Donald Trump) ప్రకటించిన కాల్పుల విరమణను పాకిస్తాన్ అంగీకరించిన కొన్ని గంటల తర్వాత కూడా పట్టించుకోలేదు. అయితే తర్వాత కొద్దిసేపటికే.. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్లపై పాకిస్తాన్ డ్రోన్ల సంచారం ఆగిపోయింది. ఈ క్రమంలో చైనాతో ఇస్లామాబాద్ చర్చల గురించి పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం పాకిస్థాన్ మితంగా వ్యవహరించిన తీరును చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రశంసించారని మెచ్చుకున్నారని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్కు చైనా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన గంటలోపే పాక్ డ్రోన్ల సంచారం ఆగిపోవడం గమనార్హం.
గగనతల ఉల్లంఘనలపై భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. ‘‘ఇస్లామాబాద్ చర్యలకు తగిన విధంగా బదులిస్తాం’’ అని మీడియాకు తెలిపారు. అమెరికాతో జరిగిన ఉన్నత స్థాయి చర్చలను భారత్ ధ్రువీకరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భారత్కి రక్షణ చర్య మాత్రమే అని, మొదట దాడి పాక్ నుంచే జరిగిందని స్పష్టంగా తెలియజేసింది. వాషింగ్టన్కి భారత్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. పాక్ దాడులపై మాత్రమే భారత్ స్పందిస్తోందని.. పాక్ ఆపితే భారత్ కూడా ఆపుతుందని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ అంగీకారం ద్వైపాక్షికంగానే జరగాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడారు. అజిత్ దోవల్తో జరిపిన చర్చలు.. ఉద్రిక్తతను తగ్గించడానికి, శాశ్వత కాల్పుల విరమణను తీసుకురావడానికి సహాయపడ్డాయని చైనా పేర్కొంది. తద్వారా కాల్పుల విరమణ తమ వల్లే సాధ్యమైందంటూ ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసింది.
ఇవీ చదవండి:
అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి