Share News

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:35 AM

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దును అనుకోకుండా దాటిన బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ పీకే సాహును పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకోగా, అతని విడుదల కోసం ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్‌ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి

Punjab: అనుకోకుండా సరిహద్దుదాటిన బీఎస్ఎఫ్‌ జవాన్‌

  • అదుపులోకి తీసుకున్న పాక్‌ రేంజర్లు

  • విడుదల కోసం ఇరుదేశాల బలగాల మధ్య చర్చలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: అనుకోకుండా సరిహద్దును దాటిన సరిహద్దు భద్రతా దళం (బీఎ్‌సఎఫ్‌) జవాన్‌ను పాకిస్థాన్‌ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మన జవాన్‌ను సురక్షితంగా విడుదల చేసేందుకుగాను ఇరు బలగాల మధ్య చర్చలు జరుగుతున్నాయని గురువారం అధికారులు తెలిపారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. 182వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ పీకే సాహు.. నీడలో విశ్రాంతి తీసుకోవడానికి రైతులతో పాటు వెళ్లాడు. ఆ తరుణంలో అతన్ని బుధవారం పాక్‌ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో జవాన్‌ యూనిఫాంను ధరించి ఉండటమేకాకుండా తన సర్వీస్‌ రైఫిల్‌ను కూడా కలిగి ఉన్నారు. జవాన్‌ను విడుదల చేయడానికి ఇరు దేశాల బలగాల మధ్య ఫ్లాగ్‌ సమావేశం జరుగుతోందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:35 AM