Share News

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

ABN , Publish Date - Jun 01 , 2025 | 06:53 PM

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

చెన్నై: తమిళనాడు (Tamilnadu) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు ఈనెల 19న జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అన్నాడీఎంకే (AIADMK) ఆదివారంనాడు ప్రకటించింది. ఐఎస్ ఇంబదురై (Inbadurai), ఎం.ధనపాల్ (M Dhanapal)ను పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించినట్టు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శఇ కేపీ మునుస్వామి ప్రకటించారు. ఈ ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. తమ భాగస్వామ్య పార్టీ అయిన డీఎండీకేకు 2026లో రాజ్యసభ సీటు కేటాయిస్తామని అన్నారు. జూలై 24న ఖాళీ కానున్న 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. రిటైర్ కానున్న సభ్యులలో ప్రముఖ నేతలు అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎండీఎంకే నేత వైకో ఉన్నారు.


కాగా, ప్రస్తుతం అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.


అధికార డీఎంకే ఇప్పటికే తమ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీనియర్ అడ్వకేట్, సిట్టింగ్ రాజ్యసభ ఎంపీ పి.విల్సన్, పార్టీ సేలం నేత ఎస్ఆర్ శివలింగం, కవి-రచయిత రూకయ్య మాలిక్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. నాలుగో సీటును తమ భాగస్వామ్య పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)కు కేటాయించింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు కమల్‌హాసన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

దేవుడు కంటే మీరే ఎక్కువ.. లూలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్

అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 06:55 PM