-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates 7th June 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వీరికేనా..!
ABN , First Publish Date - Jun 07 , 2025 | 09:15 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 07, 2025 20:25 IST
కేబినెట్ విస్తరణ.. మంత్రి పదవులు వీరికేనా..!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్
రేపు మధ్యాహ్నం .ఒంటిగంటకు తెలంగాణ కేబినెట్ విస్తరణ
ముగ్గురు కొత్తవారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్(మాదిగ) మంత్రిగా అవకాశం
మానకొండూరు MLA సత్యనారాయణ(మాల)కు ఛాన్స్
మక్తల్ MLA వాకిటి శ్రీహరి(ముదిరాజ్)కు కేబినెట్లో అవకాశం
-
Jun 07, 2025 19:57 IST
వ్యాపారిపై భూమన అభినయ్ అనుచరుల దాడి
తిరుపతి: వ్యాపారిపై భూమన అభినయ్ అనుచరుల దాడి
వ్యాపారి గాలి మోహన్రావుపై దాడి చేసిన అభినయ్ అనుచరులు చైతన్య, సాయి, యశ్వంత్
కారు స్పేర్ పార్ట్స్ కంపెనీలో చైతన్యకు వాటా
ఒకేసారి డబ్బులు ఇవ్వడం కుదరదనడంతో దాడి
తిరుపతి ఈస్ట్ పీఎస్లో ఫిర్యాదు చేసిన బాధితుడు
దాడిపై స్పందించి అభినయ్తో నిందితుల ఫొటోను ఎక్స్లో పోస్ట్ చేసిన మంత్రి లోకేష్
కూటమి ప్రభుత్వంలో రౌడీలు, సైకోలకు తావులేదు: లోకేష్
ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి: లోకేష్
-
Jun 07, 2025 19:56 IST
వైసీపీ నేత దౌర్జన్యం..
శ్రీసత్యసాయి: కొత్తచెరువులో వైసీపీ నేత సూరి దౌర్జన్యం
7 సెంట్ల భూమి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ
సుశీలమ్మ వర్గంపై వైసీపీ నేత సూరి, అనుచరులు దాడి
నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
కొత్తచెరువు పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ
-
Jun 07, 2025 17:47 IST
ఢిల్లీ: రాహుల్గాంధీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం
మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ
అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు: ఈసీ
ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి: ఈసీ
-
Jun 07, 2025 15:39 IST
మరోసారి దద్దరిల్లిన బీజాపూర్ అడవులు..
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు
ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటన
-
Jun 07, 2025 15:37 IST
ఛత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు
ఎన్కౌంటర్ ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Jun 07, 2025 15:21 IST
కర్నూలు జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ పరిశీలించిన భట్టి విక్రమార్క
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉంది: భట్టి
తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం..
పిన్నాపురం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ను సందర్శించాం: భట్టి
2029 కల్లా 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం: భట్టి
గ్రీన్కో ప్రాజెక్ట్లు దేశంలో ఇంకా రావాలి: భట్టి విక్రమార్క
-
Jun 07, 2025 14:42 IST
కేబినెట్ విస్తరణకు గ్రీన్సిగ్నల్
రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం
కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్సిగ్నల్
మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం
కాసేపట్లో రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన
-
Jun 07, 2025 13:51 IST
రామ చిలుకల సీరియస్ మీటింగ్..
ఏం మాట్లాడుకుంటున్నాయో మీరే చూడండి..
-
Jun 07, 2025 13:50 IST
హైదరాబాద్: గచ్చిబౌలి AIG ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్లో చెలరేగిన మంటలు
గ్రౌండ్ ఫ్లోర్లోని అంబులెన్స్లో మంటలు
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
-
Jun 07, 2025 12:10 IST
తెలుగు సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి కమిటీ
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో 30 మందితో కమిటీ.
ప్రత్యేక కమిటీ చైర్మన్గా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్.
కన్వీనర్గా ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదరప్రసాద్.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది సభ్యులు.
ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్రాజు, దామోదరప్రసాద్, ప్రసన్నకుమార్.
సి.కల్యాణ్, రవికిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్,
సుప్రియ, భరత్ భూషణ్, సుధాకర్రెడ్డి, ఎం. సుధాకర్, శిరీష్రెడ్డి,
వెంకటేశ్వరరావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి.
ఎగ్జిబిటర్ల సెక్టార్ నుంచి రాంప్రసాద్, సురేష్బాబు, సునీల్ నారంగ్.
వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్, బాలగోవిందరాజు.
మహేశ్వరరెడ్డి, శివప్రసాద్రావు, విజయేందర్రెడ్డి.
-
Jun 07, 2025 11:54 IST
బెంగళూరులో తొక్కిసలాట ఘటనపై BCCI సీరియస్
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా..
ర్యాలీ నిర్వహణకు మార్గదర్శకాలు జారీకి నిర్ణయం
-
Jun 07, 2025 10:57 IST
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రస్తుతం 5,755 కరోనా యాక్టివ్ కేసులు.
24 గంటల్లో 1262 కొత్త కరోనా కేసులు నమోదు.
నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి.
దేశంలో కరోనాతో ఇప్పటివరకు 59 మంది మృతి.
-
Jun 07, 2025 09:49 IST
ఏపీకి గుడ్ న్యూస్.. గూగుల్ వచ్చేస్తోంది..!
అమరావతి: ఏపీకి గూగుల్ - 143 ఎకరాల్లో ఏర్పాటు కోసం స్థల పరిశీలన.
రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్.
రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో గతంలోనే గూగుల్ ప్రతినిధుల చర్చ.
నిన్న అనంతవరం, నెక్కల్లు మధ్య సమీపంలోని ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి పరిశీలన.
ఆ స్థలాన్ని గూగుల్కు కేటాయించేందుకు ముందుకు వచ్చిన సిఆర్డిఎ.
ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి శుక్రవారం నెక్కల్లులో స్థలం పరిశీలన.
ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గు.
గూగుల్ సంస్థను ఇక్కడ నెలకొల్పితే పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం.
-
Jun 07, 2025 09:30 IST
మేడ్చల్: ఘట్కేసర్ ఏదులాబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి
మరో ఇద్దరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మృతులు కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురికి చెందిన వర్షిత్
-
Jun 07, 2025 09:15 IST
నేడు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్న..
సబలెంకా (బెలారస్), కోకోగాఫ్ (అమెరికా)