-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates 6th June 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ
ABN , First Publish Date - Jun 06 , 2025 | 10:50 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jun 06, 2025 20:40 IST
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 9న సిట్ ఎదుటకు ప్రభాకర్రావు
అమెరికా నుంచి భారత్కు రానున్న ప్రభాకర్రావు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన భారత ఎంబసీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్రావు
ఈనెల 8న హైదరాబాద్ రానున్న ప్రభాకర్రావు
-
Jun 06, 2025 20:38 IST
భారత్కు రానున్న ప్రభాకర్రావు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల 9న సిట్ ఎదుటకు ప్రభాకర్రావు
అమెరికా నుంచి భారత్కు రానున్న ప్రభాకర్రావు
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసిన భారత ఎంబసీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్రావు
ఈనెల 8న హైదరాబాద్ రానున్న ప్రభాకర్రావు
-
Jun 06, 2025 20:38 IST
ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు: మంత్రి నిమ్మల
ప్రతి 15 రోజులకోసారి సీఎం చంద్రబాబు సమీక్ష: మంత్రి నిమ్మల
భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు: నిమ్మల
పోలవరం శరవేగంగా జరుగుతున్నాయి: మంత్రి నిమ్మల
పోలవరం-బనకచర్ల వల్ల తెలంగాణకూ ప్రయోజనం: నిమ్మల
-
Jun 06, 2025 19:56 IST
అమరావతి: విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
పకడ్బందీగా మెగా డీఎస్సీ పరీక్షలు: మంత్రి లోకేష్
ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ: లోకేష్
పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు: లోకేష్
4 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి: మంత్రి లోకేష్
ఏపీలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి: లోకేష్
-
Jun 06, 2025 19:56 IST
ఏపీలో నిరక్షరాస్యులు ఎంతమందంటే..
ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు
15 - 59 ఏళ్ల వయసువారు నిరక్షరాస్యులు
సమీక్షలో విస్మయం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్
వయోజన విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని లోకేష్ ఆదేశాలు
-
Jun 06, 2025 17:42 IST
యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు
తిరుమలాపూర్ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం: రేవంత్
యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చాం: సీఎం రేవంత్
తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి: రేవంత్
కొండపై భక్తులు నిద్రించేలా, ఆటోలు నడిచేలా చేశాం: రేవంత్
స్థానిక విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తాం: రేవంత్
గంధమల్ల ప్రాజెక్టును గతంలో ఎందుకు పూర్తిచేయలేదు?
నల్లగొండ రైతుల కష్టాలు తీర్చుతాం: సీఎం రేవంత్
కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టింది: రేవంత్
మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం: తెలంగాణ సీఎం రేవంత్
గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం: సీఎం రేవంత్
పేదల ఇళ్లు కూలగొడుతున్నామంటూ విష ప్రచారం చేశారు..
సబర్మతి, గంగ నదులు ప్రక్షాళన చేస్తున్నప్పుడు..
మూసీ ప్రక్షాళన ఎందుకు చేయకూడదు?: సీఎం రేవంత్
నల్గొండ జిల్లా రైతులు బాగుపడకూడదనే BRS కుట్ర: రేవంత్
-
Jun 06, 2025 15:49 IST
కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు..
కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఇటీవల కేటీఆర్ ఆరోపణలు
ఆత్రం సుగుణ ఫిర్యాదుతో కేటీఆర్పై ఉట్నూర్లో కేసు నమోదు
కేటీఆర్పై నమోదైన కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సుగుణ
-
Jun 06, 2025 15:48 IST
నేడు స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే..
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
747 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
252 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 06, 2025 15:47 IST
మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీం పొడిగింపు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు EHSతో సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీం పొడిగింపు
1-4-2025 నుంచి 31-4-2026 వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీం వర్తింపజేస్తూ ఉత్తర్వులు
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకూ స్కీం వర్తింపు
-
Jun 06, 2025 13:41 IST
నా రాజకీయ జీవితం అంతా నైతిక విలువతోనే ఉన్నా: ఈటల
2016 తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అంచనా రూ.16,500 కోట్లు.
ఆ తర్వాత తమ్మిడిహట్టి అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది.
రూ.63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన.
ఆ తర్వాత కాళేశ్వరం అంచనా రూ.82 వేల కోట్లకు పెరిగింది.
తుమ్మడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని CWC రిపోర్టుతో.. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతోనే కాళేశ్వరం ఎంపిక.
టెక్నికల్ అంశాలన్నీ పరిశీలించాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయవద్దు.. విచారణ పూర్తి చేయాలి.
ఇప్పటికే ఏడాదిన్న కాలం వృదా చేశారు.
కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా ఎక్కడ అవినీతి జరిగిందో బయటపెట్టాలి.
-
Jun 06, 2025 13:23 IST
శనివారం ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
రేపు ఉ.11 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
మే 12 నుంచి 20 వరకు జరిగిన.సప్లిమెంటరీ పరీక్షలు
-
Jun 06, 2025 12:53 IST
ముగిసిన ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ
ఓపెన్ కోర్టులో ఈటెల రాజేందర్తో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేయించిన కమిషన్.
కమీషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.
ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు అని ఈటలను అడిగిన కమిషన్.
మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న కమీషన్.
టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఈటెల.
క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామన్న ఈటెల.
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్న ఈటెల.
మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం.
మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారన్న కాళేశ్వరం కమిషన్.
క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగిందని చెప్పిన ఈటెల రాజేందర్.
రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన కమిషన్ చీఫ్.
మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని చెప్పిన ఈటెల రాజేందర్.
హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాము.
ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని చెప్పిన ఈటెల రాజేందర్.
రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అని ప్రశ్నించిన కమిషన్.
రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని చెప్పిన ఈటెల రాజేందర్.
మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిదని కమిషన్ మరోసారి ప్రశ్నించిన కమిషన్.
మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా అని ప్రశ్నించిన కమిషన్.
టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి.. ఫైనల్గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది.
DPR కోసం 597. 45 లక్షలు వ్యాప్కోస్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? అని ప్రశ్నించిన కమిషన్.
తెలియదని సమాధానం ఇచ్చిన ఈటెల రాజేందర్.
డిపిఆర్ అప్రూవల్ క్యాబినెట్లో జరిగిందా? అన్ని అనుమతులు క్యాబినెట్లో తీసుకున్నాం.
కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు? - కమిషన్.
నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్సు పరిధిలోకి కార్పొరేషన్ రాదన్న ఈటెల.
లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు - కమిషన్
కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపెమంట్ చేయాలని అనుకున్నాం.
కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు - ఈటెల రాజేందర్.
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆఫ్ బడ్జెట్లో జరిగిందా - కమిషన్.
నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి ఆర్థిక శాఖకు సంబంధం లేదు - ఈటెల రాజేందర్.
మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు - కమిషన్.
ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్న టెక్నికల్ టీం చెప్తుందన్న ఈటెల రాజేందర్.
ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే - కమిషన్
అదంతా ఫైనాన్సు శాఖ కిందికి రాదు - ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుందన్న ఈటెల రాజేందర్.
-
Jun 06, 2025 12:26 IST
చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ..
జమ్మూకశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన.
పహెల్గామ్ ఘటన తర్వాత తొలిసారి జమ్మూకశ్మీర్కు మోదీ.
చినాబ్ రైలు వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ.
369 మీటర్ల ఎత్తులో రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం.
రూ.46 వేల కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు.
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి చినాబ్ వంతెన.
జమ్మూకశ్మీర్లోని కౌరి-బక్కల్ మధ్య వంతెన నిర్మాణం.
-
Jun 06, 2025 11:47 IST
హైదరాబాద్: BRK భవన్కు ఎంపీ ఈటల రాజేందర్
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ ఈటల
కాళేశ్వరం అవకతవకలపై ప్రశ్నించనున్న పీసీ ఘోష్ కమిషన్
BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల
ఈటలకు మద్దతుగా BRK భవన్కు భారీగా బీజేపీ కార్యకర్తలు
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల,
కేబినెట్ తీర్మానాలపై కమిషన్ ప్రశ్నలు
గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా..
ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు.
-
Jun 06, 2025 11:46 IST
హైదరాబాద్: నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్
పర్సంటేజీల కోసం కొట్టుకోవడం కాదు: బన్నీవాసు
థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎలా పెంచాలో ఆలోచించాలి.
28 రోజుల్లో సినిమా OTTకి రావడం ప్రమాదకరం.
సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
ఇలాగే ఉంటే నాలుగేళ్లలో సింగిల్ థియేటర్లు మూతపడతాయి.
ఒక్కో సినిమాకూ రెండు, మూడేళ్లు తీసుకోకూడదు.
అంత గ్యాప్ ఉంటే థియేటర్లు ఎలా రన్ చేస్తారు?
పెద్ద హీరోలు కూడా ఒకసారి ఆలోచించాలి.
-
Jun 06, 2025 10:53 IST
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం
15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహణకు రేవంత్ నిర్ణయం
ప్రతి నెల 1, మూడో శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశాలు
-
Jun 06, 2025 10:53 IST
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
24 గంటల్లో 1262 కొత్త కరోనా కేసులు నమోదు
నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి
దేశంలో ప్రస్తుతం 5,367 కరోనా యాక్టివ్ కేసులు
-
Jun 06, 2025 10:50 IST
భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..
RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష
రేపోరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు
వరుసగా మూడోసారి వడ్డీరేట్లు తగ్గింపు
7.5 శాతం వరకు తగ్గనున్న గృహ రుణాల వడ్డీరేట్లు
ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం