Share News

Breaking News: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ

ABN , First Publish Date - Jun 06 , 2025 | 10:50 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ

Live News & Update

  • Jun 06, 2025 20:40 IST

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎమర్జెన్సీ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఈనెల 9న సిట్‌ ఎదుటకు ప్రభాకర్‌రావు

    • అమెరికా నుంచి భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు

    • సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేసిన భారత ఎంబసీ

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు

    • ఈనెల 8న హైదరాబాద్‌ రానున్న ప్రభాకర్‌రావు

  • Jun 06, 2025 20:38 IST

    భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు..

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఈనెల 9న సిట్‌ ఎదుటకు ప్రభాకర్‌రావు

    • అమెరికా నుంచి భారత్‌కు రానున్న ప్రభాకర్‌రావు

    • సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేసిన భారత ఎంబసీ

    • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్‌రావు

    • ఈనెల 8న హైదరాబాద్‌ రానున్న ప్రభాకర్‌రావు

  • Jun 06, 2025 20:38 IST

    ఇరిగేషన్‌ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు: మంత్రి నిమ్మల

    • ప్రతి 15 రోజులకోసారి సీఎం చంద్రబాబు సమీక్ష: మంత్రి నిమ్మల

    • భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు: నిమ్మల

    • పోలవరం శరవేగంగా జరుగుతున్నాయి: మంత్రి నిమ్మల

    • పోలవరం-బనకచర్ల వల్ల తెలంగాణకూ ప్రయోజనం: నిమ్మల

  • Jun 06, 2025 19:56 IST

    అమరావతి: విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

    • పకడ్బందీగా మెగా డీఎస్సీ పరీక్షలు: మంత్రి లోకేష్

    • ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టుల భర్తీ: లోకేష్

    • పారదర్శకంగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు: లోకేష్

    • 4 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి: మంత్రి లోకేష్

    • ఏపీలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి: లోకేష్

  • Jun 06, 2025 19:56 IST

    ఏపీలో నిరక్షరాస్యులు ఎంతమందంటే..

    • ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు

    • 15 - 59 ఏళ్ల వయసువారు నిరక్షరాస్యులు

    • సమీక్షలో విస్మయం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

    • వయోజన విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని లోకేష్‌ ఆదేశాలు

  • Jun 06, 2025 17:42 IST

    యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ శంకుస్థాపన

    • ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు

    • తిరుమలాపూర్‌ బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌

    • తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం: రేవంత్‌

    • యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చాం: సీఎం రేవంత్‌

    • తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి: రేవంత్‌

    • కొండపై భక్తులు నిద్రించేలా, ఆటోలు నడిచేలా చేశాం: రేవంత్‌

    • స్థానిక విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తాం: రేవంత్‌

    • గంధమల్ల ప్రాజెక్టును గతంలో ఎందుకు పూర్తిచేయలేదు?

    • నల్లగొండ రైతుల కష్టాలు తీర్చుతాం: సీఎం రేవంత్‌

    • కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టింది: రేవంత్‌

    • మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం: తెలంగాణ సీఎం రేవంత్‌

    • గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం: సీఎం రేవంత్

    • పేదల ఇళ్లు కూలగొడుతున్నామంటూ విష ప్రచారం చేశారు..

    • సబర్మతి, గంగ నదులు ప్రక్షాళన చేస్తున్నప్పుడు..

    • మూసీ ప్రక్షాళన ఎందుకు చేయకూడదు?: సీఎం రేవంత్‌

    • నల్గొండ జిల్లా రైతులు బాగుపడకూడదనే BRS కుట్ర: రేవంత్‌

  • Jun 06, 2025 15:49 IST

    కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..

    • కాంగ్రెస్‌ నాయకురాలు ఆత్రం సుగుణ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    • మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ఇటీవల కేటీఆర్‌ ఆరోపణలు

    • ఆత్రం సుగుణ ఫిర్యాదుతో కేటీఆర్‌పై ఉట్నూర్‌లో కేసు నమోదు

    • కేటీఆర్‌పై నమోదైన కేసును కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

    • హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సుగుణ

  • Jun 06, 2025 15:48 IST

    నేడు స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే..

    • భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 747 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

    • 252 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 06, 2025 15:47 IST

    మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీం పొడిగింపు

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు EHSతో సమాంతరంగా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీం పొడిగింపు

    • 1-4-2025 నుంచి 31-4-2026 వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీం వర్తింపజేస్తూ ఉత్తర్వులు

    • ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకూ స్కీం వర్తింపు

  • Jun 06, 2025 13:41 IST

    నా రాజకీయ జీవితం అంతా నైతిక విలువతోనే ఉన్నా: ఈటల

    • 2016 తమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ అంచనా రూ.16,500 కోట్లు.

    • ఆ తర్వాత తమ్మిడిహట్టి అంచనా రూ.38 వేల కోట్లకు పెరిగింది.

    • రూ.63 వేల కోట్లతో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదన.

    • ఆ తర్వాత కాళేశ్వరం అంచనా రూ.82 వేల కోట్లకు పెరిగింది.

    • తుమ్మడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని CWC రిపోర్టుతో.. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతోనే కాళేశ్వరం ఎంపిక.

    • టెక్నికల్‌ అంశాలన్నీ పరిశీలించాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం.

    • ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయవద్దు.. విచారణ పూర్తి చేయాలి.

    • ఇప్పటికే ఏడాదిన్న కాలం వృదా చేశారు.

    • కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్టుగా ఎక్కడ అవినీతి జరిగిందో బయటపెట్టాలి.

  • Jun 06, 2025 13:23 IST

    శనివారం ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు

    • రేపు ఉ.11 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

    • మే 12 నుంచి 20 వరకు జరిగిన.సప్లిమెంటరీ పరీక్షలు

  • Jun 06, 2025 12:53 IST

    ముగిసిన ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ

    • ఓపెన్ కోర్టులో ఈటెల రాజేందర్‌తో అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేయించిన కమిషన్.

    • కమీషన్ ముందు 113వ సాక్షిగా హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.

    • ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు అని ఈటలను అడిగిన కమిషన్.

    • మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న కమీషన్.

    • టెక్నికల్ టీం రిపోర్టుల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు.. క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్న ఈటెల.

    • క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే మూడు బ్యారేజీల నిర్మాణం మొదలుపెట్టామన్న ఈటెల.

    • తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్న ఈటెల.

    • మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 150 నుంచి 148 కుదించాం.

    • మూడు బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారన్న కాళేశ్వరం కమిషన్.

    • క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తర్వాతే నిర్మాణం జరిగిందని చెప్పిన ఈటెల రాజేందర్.

    • రీ డిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన కమిషన్ చీఫ్.

    • మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని చెప్పిన ఈటెల రాజేందర్.

    • హరీష్ రావు చైర్మన్‌గా సబ్ కమిటీలో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాము.

    • ఎక్స్‌పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని చెప్పిన ఈటెల రాజేందర్.

    • రీ డిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అని ప్రశ్నించిన కమిషన్.

    • రీ డిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని చెప్పిన ఈటెల రాజేందర్.

    • మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం ఎవరిదని కమిషన్ మరోసారి ప్రశ్నించిన కమిషన్.

    • మూడు బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్టు ఇచ్చిందా అని ప్రశ్నించిన కమిషన్.

    • టెక్నికల్ కమిటీ చాలా రిపోర్టులు ఇచ్చాయి.. ఫైనల్‌గా మూడు బ్యారేజీల నిర్మాణం నిర్ణయం క్యాబినెట్ తీసుకుంది.

    • DPR కోసం 597. 45 లక్షలు వ్యాప్కోస్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? అని ప్రశ్నించిన కమిషన్.

    • తెలియదని సమాధానం ఇచ్చిన ఈటెల రాజేందర్.

    • డిపిఆర్ అప్రూవల్ క్యాబినెట్లో జరిగిందా? అన్ని అనుమతులు క్యాబినెట్లో తీసుకున్నాం.

    • కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు? - కమిషన్.

    • నిధుల సమీకరణ, లోన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఫైనాన్సు పరిధిలోకి కార్పొరేషన్ రాదన్న ఈటెల.

    • లోన్స్ రీపేమెంట్ ఎలా చేయాలి అనుకున్నారు - కమిషన్

    • కార్పొరేషన్ నుంచి నిధులను కలెక్షన్ చేసి లోన్స్ రీపెమంట్ చేయాలని అనుకున్నాం.

    • కానీ కార్పొరేషన్ ద్వారా నిధుల కలెక్షన్ కాలేదు - ఈటెల రాజేందర్.

    • ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆఫ్ బడ్జెట్‌లో జరిగిందా - కమిషన్.

    • నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగాయి ఆర్థిక శాఖకు సంబంధం లేదు - ఈటెల రాజేందర్.

    • మూడు బ్యారేజీలు అక్కడ కట్టేది కాదని అంటే మీరేమంటారు - కమిషన్.

    • ఎక్కడ ఏ బ్యారేజీ కట్టాలన్న టెక్నికల్ టీం చెప్తుందన్న ఈటెల రాజేందర్.

    • ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటే - కమిషన్

    • అదంతా ఫైనాన్సు శాఖ కిందికి రాదు - ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుందన్న ఈటెల రాజేందర్.

  • Jun 06, 2025 12:26 IST

    చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ..

    • జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.

    • పహెల్గామ్‌ ఘటన తర్వాత తొలిసారి జమ్మూకశ్మీర్‌కు మోదీ.

    • చినాబ్‌ రైలు వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ.

    • 369 మీటర్ల ఎత్తులో రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జి నిర్మాణం.

    • రూ.46 వేల కోట్ల ప్రాజెక్టులకు కట్రాలో మోదీ శంకుస్థాపనలు.

    • ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి చినాబ్‌ వంతెన.

    • జమ్మూకశ్మీర్‌లోని కౌరి-బక్కల్‌ మధ్య వంతెన నిర్మాణం.

  • Jun 06, 2025 11:47 IST

    హైదరాబాద్‌: BRK భవన్‌కు ఎంపీ ఈటల రాజేందర్‌

    • కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన ఎంపీ ఈటల

    • కాళేశ్వరం అవకతవకలపై ప్రశ్నించనున్న పీసీ ఘోష్‌ కమిషన్‌

    • BRS ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల

    • ఈటలకు మద్దతుగా BRK భవన్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు

    • కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదల,

    • కేబినెట్‌ తీర్మానాలపై కమిషన్‌ ప్రశ్నలు

    • గతంలో అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా..

    • ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నలు.

  • Jun 06, 2025 11:46 IST

    హైదరాబాద్‌: నిర్మాత బన్నీ వాసు సంచలన ట్వీట్‌

    • పర్సంటేజీల కోసం కొట్టుకోవడం కాదు: బన్నీవాసు

    • థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎలా పెంచాలో ఆలోచించాలి.

    • 28 రోజుల్లో సినిమా OTTకి రావడం ప్రమాదకరం.

    • సింగిల్‌ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

    • ఇలాగే ఉంటే నాలుగేళ్లలో సింగిల్‌ థియేటర్లు మూతపడతాయి.

    • ఒక్కో సినిమాకూ రెండు, మూడేళ్లు తీసుకోకూడదు.

    • అంత గ్యాప్‌ ఉంటే థియేటర్లు ఎలా రన్‌ చేస్తారు?

    • పెద్ద హీరోలు కూడా ఒకసారి ఆలోచించాలి.

  • Jun 06, 2025 10:53 IST

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • ప్రతినెలా రెండుసార్లు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని నిర్ణయం

    • 15 రోజులకోసారి కేబినెట్‌ భేటీ నిర్వహణకు రేవంత్‌ నిర్ణయం

    • ప్రతి నెల 1, మూడో శనివారం తెలంగాణ కేబినెట్‌ సమావేశాలు

  • Jun 06, 2025 10:53 IST

    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

    • 24 గంటల్లో 1262 కొత్త కరోనా కేసులు నమోదు

    • నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి

    • దేశంలో ప్రస్తుతం 5,367 కరోనా యాక్టివ్‌ కేసులు

  • Jun 06, 2025 10:50 IST

    భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు..

    • RBI ద్రవ్య పరపతి విధాన సమీక్ష

    • రేపోరేటు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

    • వరుసగా మూడోసారి వడ్డీరేట్లు తగ్గింపు

    • 7.5 శాతం వరకు తగ్గనున్న గృహ రుణాల వడ్డీరేట్లు

    • ఆర్‌బీఐ నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం