IRCTC Ramayana Yatra:IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..
ABN , Publish Date - Jul 07 , 2025 | 01:38 PM
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.

IRCTC Ramayana Tour Package: కాలానుగుణంగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం అనేక పర్యాటక, ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈసారి IRCTC రాముడికి సంబంధించిన 30 కి పైగా క్షేత్రాలను సందర్శించడానికి భక్తుల కోసం మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. జూలై 25, 2025 నుంచి ఆరంభం కానున్న శ్రీ రామాయణ రైలు యాత్రలో భాగంగా భక్తులు.. 17 రోజుల పాటు ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకూ ఉన్న వివిధ రామక్షేత్రాలను దర్శించుకుంటారు.
రాముని జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ పూర్తయిన నాటి నుంచి దేశవిదేశీ భక్తులు ఆ ఆలయాన్ని సందర్శించాలని తహతహలాడుతున్నారు. రామక్షేత్రాలకు పర్యాటకుల్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని IRCTC జులై 25, 2025 నుంచి ఐదవ 'శ్రీ రామాయణ యాత్ర' డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించబోతోంది. ఈ ప్రయాణం 17 రోజులు ఉంటుంది. ఈ టూర్లో భాగంగా యాత్రికులు భారతదేశం, నేపాల్లోని రాముడికి సంబంధించిన 30 కి పైగా ప్రదేశాలు సందర్శిస్తారు.
గత సంవత్సరం జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ఐఆర్సీటీసీ రామాయణ రైలు యాత్రను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది 5వ రామాయణ పర్యటన. మునుపటి అన్ని పర్యటనల్లోనూ యాత్రికుల నుంచి ఈ ప్యాకేజీకి అద్భుతమైన స్పందన లభించింది. రెస్టారెంట్, కిచెన్, షవర్, సెన్సార్ వాష్రూమ్లు, CCTV భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు ఈ యాత్రను నిర్వహిస్తుంది.
ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ (AC) రైలు. దీనిలో మూడు రకాల సీటింగ్లు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC కోచెస్ ఉంటాయి. ప్రతి కోచ్లో CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ప్యాకేజీలో భాగంగా భోజనాలు, 3-స్టార్ వసతి, ప్రయాణ బీమాతో సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జూలై 25, 2025 నుంచి ఐదవ ప్రత్యేక శ్రీ రామాయణ యాత్ర రైలును ప్రారంభిస్తోంది. ప్యాకేజీ ధర రూ. 1.17 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ స్టేషన్ నుంచి ప్రారంభమై అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హి, జనక్పూర్ (నేపాల్), బక్సర్, వారణాసి, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో రాముడికి సంబంధించిన 30 కి పైగా పుణ్యక్షేత్రాలను 17 రోజుల్లో కవర్ చేస్తారు.
యాత్రలో దర్శించే స్థలాల వివరాలు:
ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య. ఇక్కడ ప్రయాణికులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్) సందర్శిస్తారు.
దీని తర్వాత నందిగ్రామ్లో భారత్ మందిర్.
నేపాల్లోని సీతామర్హి, జనక్పూర్లలో సీతాదేవి జన్మించిన ప్రదేశం, జానకిరాముని ఆలయం.
బక్సర్లో రామరేఖ ఘాట్, రామేశ్వరనాథ్ ఆలయం.
వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం, తులసి దేవాలయం, సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం, గంగా ఆరతిని సందర్శిస్తారు.
అనంతరం ప్రయాగ్రాజ్, శృంగవేర్పూర్, చిత్రకూట్ వంటి ప్రదేశాలను చూసి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఉదయాన్నే నాసిక్ చేరుకుని త్రయంబకేశ్వరాలయం, పంచవటి సందర్శిస్తారు.
హంపిలో ఆంజనేయ కొండ (హనుమంతుడు జన్మించిన ప్రదేశం), విఠల ఆలయం, విరూపాక్ష ఆలయం చూస్తారు.
చివరగా రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, ధనుష్కోడి సందర్శిస్తారు.
టికెట్ ధరలు:
3AC (థర్డ్ AC): ఒక్కొక్కరికి ₹1,17,975
2AC (సెకండ్ AC): ఒక్కొక్కరికి ₹1,40,120
1AC క్యాబిన్ (ఫస్ట్ AC లో ప్రైవేట్ క్యాబిన్): ఒక్కొక్కరికి ₹1,66,380
1AC కూపే (ఫస్ట్ ACలో 2-వ్యక్తుల ప్రైవేట్ కోచ్): ఒక్కొక్కరికి రూ.1,79,515
టికెట్ బుకింగ్:
ఈ టూర్ కోసం IRCTC అధికారిక టూరిజం పోర్టల్ ద్వారా ప్రయాణికులు నేరుగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. పరిమిత సీట్ల కారణంగా త్వరగా టికెట్లు అమ్ముడుపోయే అవకాశముంది. కాబట్టి, ఆసక్తి ఉన్న యాత్రికులు వెంటనే త్వరపడండి.
Also Read:
ఆడవాళ్ల గురించి మగవాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేని 4 విషయాలు ఇవే..
బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..
For More Lifestyle News