Home » IRCTC
కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.
ఈ మధ్య ఐఆర్సీటీసీ ఆధ్యాత్మిక, పర్యాటక టూర్ల కోసం వివిధ ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. మీకు వెళ్లాలని మనసులో ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేమని వెనకేస్తున్నట్లయితే.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇ-కామర్స్ సైట్లలో లాగే రైలు టికెట్లనూ ఈఎంఐలో కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక కొత్త టూర్ ప్యాకేజీను ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో గంగాసాగర్, జగన్నాథ్, కాశీ, బైద్యనాథ్ ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు.
దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఇప్పుడు కొత్తగా ప్రయాణికుల కోసం వీక్లీ టూరిజం ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. అదీ టికెట్ గ్యారెంటీ హామీతో. టూర్ ప్యాకేజీని బట్టి యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
IRCTC Ramayana Yatra Package: దేశవ్యాప్తంగా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలోనే మరోసారి రామాయణ యాత్ర స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రారంభించనుంది. ఈ నెల జులై 25 నుంచి మొదలుకానున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో పర్యాటకులు 17 రోజుల్లోనే 30 ప్రముఖ రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల రిజర్వేషన్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంతోపాటు, ప్రయాణికులకు ముందుగానే తమ స్థితి తెలుసుకునే అవకాశాన్ని కల్పించేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
Railways Fares Hike July1 2025: ప్రయాణీకులకు రైల్వేశాఖ షాకిచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత టికెట్ ఛార్జీలను పెంచనుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ.. జూలై 1 నుంచి టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నట్లు తెలుస్తోంది. రైల్వే ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి చేసినట్లు సమాచారం.
తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురాబోతోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది.