Share News

Thailand Cambodia Border Clash: సరిహద్దులో గజగజ.. 14 మంది మృతి, భయంతో పారిపోయిన వేలాది మంది

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:26 AM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం తీవ్ర హింస రూపం దాల్చింది. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

Thailand Cambodia Border Clash: సరిహద్దులో గజగజ.. 14 మంది మృతి, భయంతో పారిపోయిన వేలాది మంది
Thailand Cambodia Border Clash

థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దులో గురువారం జరిగిన తీవ్రమైన హింసాత్మక ఘటనలో 14 మంది మరణించారు. వీరిలో ఒక థాయ్ సైనికుడు కూడా ఉన్నాడు. ఈ ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు, దాదాపు 10 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన గత దశాబ్దంలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన సరిహద్దు ఘర్షణగా (Thailand Cambodia Border Clash) నిలిచింది.


ఘర్షణ ఎలా మొదలైంది

ఈ హింస గురువారం ఉదయం సరిహద్దులోని ఆరు ప్రాంతాల్లో రాకెట్, ఆర్టిలరీ దాడులతో మొదలైంది. కంబోడియా దళాలు థాయిలాండ్ భూభాగంపై రాకెట్లు, ఆర్టిలరీని ప్రయోగించాయని థాయ్ అధికారులు ఆరోపించారు. ఈ దాడుల్లో 13 మంది సామాన్య పౌరులు, ఒక ఎనిమిదేళ్ల చిన్నారి, ఒక థాయ్ సైనికుడు మరణించారు. దాదాపు 46 మంది గాయపడగా, వారిలో 14 మంది సైనికులు ఉన్నారు.

యుద్ధ నేరం..

థాయిలాండ్‌లోని సురిన్ ప్రావిన్స్‌లో ఒక ఆసుపత్రి కూడా ఈ దాడుల్లో లక్ష్యంగా మారింది. ఈ దాడిని థాయ్ ఆరోగ్య మంత్రి సోమ్‌సాక్ థెప్సుతిన్ తీవ్రంగా ఖండించారు. దీనిని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రకారం ఈ దాడులు ఆరు సరిహద్దు ప్రావిన్సులలో జరిగాయి.


ఇళ్లను వదిలి..

కంబోడియా అధికారుల ప్రకారం గురువారం జరిగిన ఘర్షణల్లోనే నలుగురు పౌరులు గాయపడ్డారు. 4,000 మందికి పైగా గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి పారిపోయారని తెలిపారు. అనేక మంది మొత్తం కుటుంబాలతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామ్రాంగ్ పట్టణానికి సమీపంలో ఉన్న తాత్కాలిక శిబిరాలకు చేరుకున్నారు.

ఘర్షణకు కారణం ఏంటి?

ఈ ఘర్షణకు తాజా కారణం సరిహద్దు సమీపంలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు. దీనిలో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా, థాయిలాండ్ తన రాయబారిని కంబోడియా నుంచి రీకాల్ చేసింది. అదే సమయంలో కంబోడియా రాయబారిని బ్యాంకాక్ నుంచి బహిష్కరించింది. ఇది క్రమంగా రెండు దేశాలు ఒకరినొకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది.


సరిహద్దు వివాదం నేపథ్యం

ఈ హింసకు మూలం థాయిలాండ్, కంబోడియా మధ్య 817 కిలోమీటర్ల సరిహద్దు వివాదం అని కూడా చెబుతున్నారు. ఈ రెండు దేశాలూ వేర్వేరు కాలనీ యుగపు మ్యాప్‌లను ఆధారంగా చేసుకుని సరిహద్దుపై హక్కులను కోరుతున్నాయి. 2008 నుంచి 2011 వరకు జరిగిన సరిహద్దు ఘర్షణల్లో డజన్ల కొద్దీ మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 09:01 AM