Sharmistha: పాక్ గురించి నిజం చెప్పడం తప్పా? ఆమెను వదిలేయండి.. డచ్ ఎంపీ..
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:39 PM
Dutch Politician Supports Sharmistha: ఆపరేషన్ సిందూర్ గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ట పనోలిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై డచ్ ఎంపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆమెని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే..

Sharmistha Panoli Arrest: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ట పనోలి అరెస్టును ఖండిస్తూ డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ ఎక్స్ వేదికగా మద్దతు ప్రకటించారు. పాకిస్థాన్, ముహమ్మద్ లపై ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఇది వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమేనని ఆరోపించారు. వెంటనే ఆమెను రిలీజ్ చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ట్యాగ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు.ఇన్స్టాగ్రామ్ వీడియోలో పహల్గాం దాడి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శుక్రవారం కోల్కతా పోలీసులు శర్మిష్టని అరెస్టు చేశారు.
ఆమెకు సాయం చేయండి: డచ్ ఎంపీ వైల్డర్స్
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ట పనోలి స్వదేశంలోనే కాదు. విదేశీ నేతల నుంచి కూడా మద్ధతుగా లభిస్తోంది. డచ్ ఎంపీ రైట్-వింగ్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ పార్టీ నేత గీర్ట్ వైల్డర్స్ ఎక్స్ వేదికగా శర్మిష్ట అరెస్టును తీవ్రంగా ఖండించారు. 'ధైర్యవంతురాలైన శర్మిష్ట పనోలిని విడుదల చేయండి. ఆమెను అరెస్టు చేయడం వాక్ స్వాతంత్య్రానికి అవమానం. పాకిస్థాన్, మహమ్మద్ గురించి నిజం మాట్లాడినందుకు ఆమెను శిక్షించకండి. ఆమెకు సహాయం చేయండి" అని ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ వైల్డర్స్ Xలో పోస్ట్ చేశారు.
హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన శర్మిష్ట పనోలి అరెస్టు రాజకీయ వివాదానికి దారితీసింది. మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను రెచ్చగొట్టి శాంతికి భంగం కలిగిస్తుందనే ఆరోపణలతో బెంగాల్ పోలీసులు శుక్రవారం న్యాయవిద్యార్థిని శర్మిష్టను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ, నటి కంగానా రనౌత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు శర్మిష్టకు మద్ధతుగా నిలిచారు. తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ కూడా స్పందించారు.
న్యాయవిద్యార్థిని శర్మిష్ట పనోలి ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంది. 22 ఏళ్ల ఈ యువతి పుణె లా యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తోంది. కొన్నాళ్ల కిందట ఆపరేషన్ సిందూర్ పై బాలీవుడ్ నటులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ ఒక వీడియో పోస్ట్. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో క్షమాపణలు చెప్తూ వెంటన డిలీట్ చేసింది. అయినప్పటికీ, తాజాగా దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోల్కతా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే చట్టపరంగానే శర్మిష్టను అరెస్టు చేసినట్లు బెంగాల్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఇవీ చదవండి:
వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా
నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి