Telangana Formation Day: తెలుగువారు సమున్నతంగా ఎదగాలి
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:31 AM
తెలుగువారు సమున్నతంగా ఎదగాలని సీఎం చంద్రబాబు, తెలంగాణ 11వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించి అభివృద్ధి కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్లాలి
ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల శుభాకాంక్షలు
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. ‘జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్లో స్పందిస్తూ... ‘‘తెలంగాణ రాష్ట్రంలో ‘హస్తమే’ అభయ హస్తమై ప్రజా పాలన అందిస్తోంది.’’ అని పేర్కొన్నారు.