Special trains: మహా కుంభమేళాకు గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు..
ABN , Publish Date - Feb 06 , 2025 | 12:25 PM
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

గుంతకల్లు(అనంతపురం): ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న తిరుపతి-దానాపూర్ ప్రత్యేక రైలు (నం. 07117) రాత్రి 11-45 గంటలకు తిరుపతిలో బయలుదేరి రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11-55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07118) ఈ నెల 17న దానాపూర్లో మధ్యాహ్నం 3-15 గంటలకు బయలుదేరి 19వ తేదీ మధ్యాహ్నం 1-55 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని వివరించారు.
ఈ వార్తను కూడా చదవండి: భార్యను సంసారానికి పంపలేదని చిన్నత్తను కత్తితో పొడిచిన యువకుడు
ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, ఉందానగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, చర్లపల్లి, ఖాజీపేట్, పెద్దపల్లి(Kacheguda, Malkajgiri, Cherlapalli, Khajipet, Peddapalli), రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బాలార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సి, పిప్రియా, జబల్పూర్, కట్ని, సట్నా, మానిక్పూర్, ప్రయాగరాజ్ చౌకీ, మీర్జాపూర్, పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అర స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.
అలాగే తిరుపతి-దానాపూర్ ప్రత్యేక రైలు (నం. 07119) ఈ నెల 18వ తేదీ రాత్రి 11-45 గంటలకు తిరుపతిలో బయలుదేరి 20వ తేదీ రాత్రి 11-55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07120) ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3-15 గంటలకు దానాపూర్లో బయలుదేరి 23వ తేదీ మధ్యాహ్నం 1-45 గంటలకు తిరుపతికి చేరుతుందన్నారు. ఈ రైలు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి,
గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, సూళేహళ్లి, సేడం, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట్, పెద్దపల్లి, రామగగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బాలార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సి, పిప్రియా, జబల్పూర్, కట్ని, సట్నా, మానిక్పూర్, ప్రయాగరాజ్ చౌకీ, మీర్జాపూర్, పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అర స్టేషన్ల మీదుగా వెళుతుందని వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News