Home » Guntakal
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మండలపరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్లకు నీటితో క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు. దీంతో చేసిన పనులు ఎన్ని రోజులు ఉంటాయో అర్థంకాని పరిస్థితి. మండలకేంద్రమైన కూడేరుతో పాటు కొర్రకోడు, కడదరకుంట గ్రామాల్లో ఓ కాంట్రాక్టర్ దాదాపు రూ, 46.60 లక్షలతో సిమెంట్ రోడ్లు వేశారు. కానీ వాటి క్యూరింగ్ మరిచారు.
మండలకేంద్రంలో సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంగమ్మ, సంగప్పనంది వాహనంపై విహరించారు. మంగళవారం ఉదయం ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించా రు.
స్థానిక బార్ అసోసియేషన నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది శ్రీకాంత రెడ్డి ఎన్నికయ్యా రు. పట్టణంలోని బార్ అసోసియేషన కార్యాలయంలో సోమవారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి శ్రీకాంత రెడ్డి, మనోహర్ బాబు పోటీ పడ్డారు.
పట్టణంలోని సీహెచసీలో కమ్యూనిటీ మరుగుదొడ్లు, 108 వాహనం పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. రోగులు ఇబ్బందు లు పడకూడదన్న ఉద్దేశ్యంతో గతంలో స్వచ్ఛ భారత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్లు పూర్తి అధ్వాన స్థితికి చేరుకుని, వృథాగా పడి ఉన్నాయి.
రైతు క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అ న్నారు. ఆయన సోమవారం ప్రజావేదికలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. బీటీపీ కాలువ పనులను పూర్తి చేసి కృష్ణాజ లాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
రాష్ట్రంలో పేదరికాన్ని పా రదోలడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటుప డుతున్నారని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. సోమవా రం సాయంత్రం స్థానిక ఎస్ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో మార్గదర్శి బంగారు కుటుంబం (ఎంబీకే) 10-20 వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వ హించారు.
పరస్పర సహకా రంతోనే పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం డ్వామా కార్యాలయంలో డీఎల్డీవో నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పీ-4 సర్వే వార్షికోత్సవాన్ని నిర్వ హించారు.