Home » Peddapalli
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్య క్రమంలో అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
కర్రె గుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను ఆపాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వ ర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం వేసవి శిక్షణ తరగతు లను నిర్వహిస్తున్నామని, వాటి ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొ న్నారు. సోమవారం కలెక్టరే ట్లో ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలలో 1నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు మే1 నుంచి జూన్ 10 వరకు సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నామ న్నారు.
ఉగ్రవా దానికి వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ సీనియర్ నాయ కులు పల్లె సదానందం పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే నివాసంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న తలపెట్టిన బంద్లో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగులు పాల్గొని విజయ వంతం చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు పిలుపుని చ్చారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి పుట్ట మధు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆదివారం తరలివెళ్ళారు. జూనియర్ కళాశాల ఎదుట ఉన్న పార్టీ జెండాను పుట్ట మధు ఆవిష్కరించారు.
మేడే స్ఫూరితో కేంద్ర ప్రభు త్వంపై పోరాటం చేస్తామని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేక రుల సమావేశంలో మాట్లాడారు.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద మారణకాండను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖనిలో బంద్ జరిగింది. వర్తక, వ్యాపార వర్గాలు బంద్కు స్వచ్ఛం దంగా మద్దతు ప్రకటించాయి. విశ్వహిందు పరిషత్, బజరంగ్దళ్, కాంగ్రెస్ నాయకులు వ్యాపార కేంద్రాల్లో తిరుగుతూ బంద్కు సహకరించాలని కోరారు.
అన్నదాతల ఆశలకు కష్టాలు తోడయ్యాయి. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా, కాంటాల జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండల్లో సౌకర్యాలు లేక చెట్ల నీడలో ఉంటూ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహ కార సంఘాలు ఇక నుంచి రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మారనున్నాయి. మొదటి విడతలో తొమ్మిది సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘా లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు ఉండగా, మొదటి విడతలో 311 సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మార్చారు.