Bollywood Actor Sonu Sood : సామాన్యుల కోసమే సీఎం తపన
ABN , Publish Date - Feb 04 , 2025 | 03:12 AM
ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోనూసూద్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 ఆంబులెన్స్లను విరాళంగా అందించింది.

చంద్రబాబు ఓ విజనరీ.. ఎందరికో స్ఫూర్తి
ప్రముఖ నటుడు సోనూసూద్ వెల్లడి
అమరావతిలో ముఖ్యమంత్రితో భేటీ
ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్లు విరాళమిచ్చిన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’
సోనూసూద్ చొరవ స్ఫూర్తిదాయకం: సీఎం
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల
కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టీకరణ
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబును ప్రముఖ నటుడు, ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవా రం అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకం గా కలిశారు. ఆరోగ్యం, సామాజిక సంక్షేమం విషయంలో సేవలందించే సోనూసూద్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 4 ఆంబులెన్స్లను విరాళంగా అందించింది. అత్యవసర సమయాల్లో రోగులను ఆస్పత్రికి తరలించేందుకు, సుదూర ప్రాంతాల్లో క్లిష్టమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్స్లు అం దించిన సోనూసూద్ను సీఎం అభినందించారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం అత్యవసర వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలతో వైద్యం అందేలా.. తమ ప్రభుత్వం ప్రాఽధాన్యత ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.
సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతోనే..
సీఎంను కలిసిన అనంతరం సోనూసూద్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఒక విజినరీ అని, సామాన్యుల కోసం చాలా ఆలోచిస్తారని అన్నారు. సమాజానికి మేలు చేయాలన్న విషయంలో ఆయన చాలా మందికి స్ఫూర్తి అని కొనియాడారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని, సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనే ఇలా ముందుకు నడిపిస్తోందని స్పష్టం చేశారు. కొవిడ్ సమయం నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో, వైద్య సదుపాయాలు సరిగ్గాలేని ప్రాంతాల కోసం అంబులెన్స్లను ఇచ్చానని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలోనే ప్రజలను ఆదుకోవాలన్న బాధ్యత మొదలైందన్నారు. ఎవరికైనా తాను ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానన్నారు. సూద్ ఫౌండేషన్ ప్రతి సామాన్యుడి కోసం పని చేస్తుందని, అవసరమైతే ప్రభుత్వాలతోనూ కలిసి పని చేస్తామన్నారు. అంబులెన్సులను నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉపయోగిస్తారని అనుకుంటున్నానన్నారు. డిప్యూటీ సీఎం పవ న్ కల్యాణ్ను కూడా త్వరలోనే కలుస్తానన్నారు.
మరింత మందికి స్ఫూర్తి: సీఎం
ఏపీలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్న తమ ప్రభుత్వ లక్ష్యంలో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామ్యం కావడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశా రు. సోనూసూద్ చొరవ మారుమూల ప్రాంతాలకూ ఆరోగ్య సేవలను అందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు సోనూసూద్తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. సూద్ ఫౌండేషన్ చొరవ మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఏపీ నాకు రెండో ఇళ్లు లాంటిది..
నటుడిగా తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న తెలుగు ప్రజలకు సోనూసూద్ ధన్యవాదాలు చెప్పారు. తెలుగువారు తనకు అత్యంత ఆప్తులని, వారికి ఏదైనా చేయడం బాధ్యతగా భావిస్తానన్నారు. ‘ఏపీ నాకు రెండో ఇల్లు లాంటి ది. ఇక్కడి ప్రజల కారణంగానే నేను ఇంతవాడినయ్యా. నా సతీమణి కూడా ఆంధ్రాకు చెందిన తెలుగు వ్యక్తే’ అని తెలిపారు. టాలీవుడ్లో పని చేసేందుకు సిద్ధంగానే ఉన్నానని.. తెలుగు దర్శ క, నిర్మాతలకు ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నానని చెప్పారు. నటుడిగా ఏ పాత్ర చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.