Share News

హాజరు కోసమే అసెంబ్లీకి జగన్‌: పురందేశ్వరి

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:19 AM

హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

హాజరు కోసమే అసెంబ్లీకి జగన్‌: పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. వరుసగా ఆరు నెలలపాటు అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని, ఆ భయంతోనే జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారన్నారు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బూతుల పురాణం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీని కౌరవ సభలాగా నడిపించారని పురందేశ్వరి ఒంగోలులో ధ్వజమెత్తారు.

Updated Date - Feb 26 , 2025 | 04:20 AM