Share News

TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

ABN , Publish Date - May 25 , 2025 | 05:20 AM

పల్నాడులో టీడీపీ నేతలన్నదమ్ములపై ప్రత్యర్థులు స్కార్పియోతో ఢీకొట్టి దారుణ హత్య చేశారు. ఈ ఘటన రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన ఘోర సంఘటనగా మండలంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి.

 TDP Opposition Clash: పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య

  • బైక్‌పై వస్తుండగా అన్నదమ్ములపై దాడి

  • స్కార్పియోతో ఢీకొట్టి చంపిన ప్రత్యర్థులు

  • వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టెన్షన్‌

గుంటూరు, మే 24(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనంపై వస్తున్నవారిని స్కార్పియోతో గుద్ది దారుణం గా హత్యచేశారు. ఈ ఘటనలో టీడీపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముల కాళ్లు విరిగిపోయాయి. అక్కడికక్కడే వారు మృత్యువాతపడ్డారు. కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి మారిన ప్రత్యర్థులు రాజకీయ ఆధిపత్యం లో భాగంగా ఇంత ఘాతుకానికి ఒడిగట్టారు. పల్నాడులోని వెల్దుర్తి మండలం గుండ్లపాడులో శనివారం ఈ ఘటన కలవరం రేపింది. వైసీపీ హయాంలో ఆ పార్టీ గూండాలు హత్యచేసిన టీడీపీ నేత చంద్రయ్య ది కూడా ఇదే గ్రామం. గుండ్లపాడు గ్రామంలో చంద్రయ్య, జెవిశెట్టి వెంకటేశ్వర్లు(మొద్దయ్య) (60 ), తమ్ముడు కోటేశ్వరరావు(56) టీడీపీలో కీలక నేత లు. చంద్రయ్య హత్యకు గురైనప్పటినుంచి ఈ అన్నదమ్ములే పార్టీ వ్యవహారాలను గ్రామంలో చక్కబెడుతున్నారు. అయితే గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వెంకట్రామయ్య వర్గం, ఆ తరువాత టీడీపీలో చే రింది. గ్రామంలో రాజకీయ ఆధిపత్యం కోసం వెంకటరామయ్య ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులకు గ్రామంలో మంచి పట్టు ఉంది. దీంతో వారిద్దరు ఉన్నంతవరకు గ్రామంలో తన ఆధిపత్యం నడవదని వెంకట్రామ య్య భావించారు. రెండు రోజుల క్రితం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో పల్లెనిద్రకు వచ్చారు. ఎస్పీ వెళుతూ.. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చి నా పెద్దమనిషిగా ఉన్న జెవిశెట్టి వెంకటేశ్వర్లును సంప్రదించాలని సూచించారు. ఎస్పీ ప్రకటన కూడా వెంకట్రామయ్యకు కంటకింపుగా మారింది. అలాగే, వెంకట్రామయ్య వర్గానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రెండు కాళ్లు కొంతమంది వ్యక్తులు విరగ్గొట్టారు. ఈ ఘటనలో దాడి చేసినవారికి వెంకటేశ్వరరావు మద్దతుగా నిలవడం కూడా వెంకట్రామయ్య కు రుచించలేదు. దీంతో వారిరువురిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి పెదనాన్న కుమారుడు జెవిశెట్టి శ్రీనివాసరావు(బొబ్బలి) అనే వ్యక్తితో కలిసి వెంకట్రామయ్య పక్కా ప్లాన్‌ రచించారు.


వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుతోపాటు వెంకటేశ్వర్లు అల్లుడు తోట ఆంజనేయులు, మరో 12 మంది తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నక్కలగూడెం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లారు. వేడుక ముగించుకుని ద్విచక్ర వాహనాలపై శనివారం గ్రామానికి బయలుదేరారు. మిగిలిన వారంతా మాచర్లలో ఆగి టీ తాగుతుండగా వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ద్విచ క్ర వాహనంపై గుండ్లపాడుకు బయలుదేరారు. గ్రా మానికి వెళ్లే మార్గంలో అప్పటికే వారి ప్రత్యర్థులు తోట వెంకటరామయ్య, జెవిశెట్టి శ్రీనివాసరావు, మరో ఇరువురు ముందే రెక్కీ నిర్వహించి దాడికి సిద్ధంగా ఉన్నారు. స్కార్పియో వాహనంలో గుండ్లపాడు నుంచి మాచర్లకు వచ్చేమార్గంలో అన్నదమ్ముల ద్విచక్ర వాహనానికి ఎదురుగా వచ్చారు. భోజనవీడు- మండాది గ్రామాలకు మధ్యలో అతివేగంగా స్కార్పియోతో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో అన్నదమ్ములు రోడ్డు పక్కన ఉన్న నాలుగడుగుల కట్ట మీద నుంచి ఎగిరి 10 అడుగుల దూరంలో పడిపోయారు. వారి ఇరువురి కాళ్లు విరిగిపోయాయి. తీవ్రంగా రక్తస్రావమై వారిరువురి ప్రాణాలు పోయాయా లేదంటే కదల్లేని స్థితిలో ఉన్నవారిని హత్య చేశారా అన్నదానిపై స్పష్టత రాలేదు. అయితే వారి ఒంటిపై వేరే గాయాలు లేవని పోలీసులు అంటున్నారు. సమీపంలో ఎక్కడా కూడా మారణాయుధాలు పోలీసులకు లభించలేదు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంతోపాటు స్కార్పియో ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటన జరిగిన పది నిమిషాల్లోనే వెంకటేశ్వర్లు అల్లుడు తోట ఆంజనేయులు ద్విచక్ర వాహనంపై వెనుకనే వచ్చారు. ఆ సమయానికి వెంకట్రామయ్య, శ్రీనివాసరావు డ్రైవర్‌తో పాటు మరొకరు స్కార్పియోను అక్కడే వదిలేసి రచ్చమల్లపాడు వెళ్లే డొంకలోకి పారిపోతుండటాన్ని ఆంజనేయులు చూశారు. పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Updated Date - May 25 , 2025 | 05:22 AM