Share News

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:05 AM

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు  కొనసాగుతున్న వరదనీరు
Srisailam project

నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam project)కు రోజు రోజుకు కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు (Flood water) భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో (inflow).. 30.797 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో (Outflow) నిల్.. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు.. కాగా ప్రస్తుతం నీటిమట్టం : 829.80 అడుగులు ఉంది. పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం : 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం: 49.3230 టీఎంసీల నీరుంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిల్.


26,817 క్యూసెక్కుల నీరు విడుదల..

కాగా ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 31,162 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాం వైపునకు వస్తుండగా, 36,740 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ఎంజీకేఎల్‌ఐ కాల్వ ద్వారా 416 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. దీంతో శనివారం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను, 828.20 అడుగులకు చేరింది. 215.807 టీఎంసీల సామర్థ్యానికి గాను 47.7648 టీఎంసీల నీటి నిల్వలు నమోదు అవుతున్నట్లు డ్యాం గేజింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో 1,095 క్యూసెక్కుల నీటితో 0.484 మిలియన్‌ యూనిట్లు, కుడి గట్టు కేంద్రంలో 638 క్యూసెక్కులు నీటిని వినియోగించి 0.291 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పాదన చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం నిల్వ నీటి నుంచి 2,310 క్యూసెక్కుల నీరు అవుట్‌ ఫ్లో కొనసాగుతున్నదని శనివారం డ్యాం అధికారులు తెలిపారు.

Also Read: సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు


కొనసాగుతున్న జల విద్యుత్‌ ఉత్పత్తి

ఎగువ నుంచి వరద కొనసాగుతున్న కారణంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ దిగువ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ఎస్‌ఈ శ్రీధర్‌ తెలిపారు. శనివారం సాయంత్రం నాటికి ఎగు వ జూరాలలో నాలుగు యూనిట్ల ద్వారా 2.338 మిలి యన్‌ యూనిట్ల ఉత్పత్తి కొనసాగించినట్లు తెలిపారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లు ప్రారంభించి 2.284 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి రాబట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది గత ఏడాది కంటే ముందుగానే వరద వచ్చిన కారణంగా ముందుగానే ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

20 రోజుల్లో 9సార్లు చెప్పారు..

టెన్త్‌ పేపర్లు ఎత్తుకుపోయిన జగన్‌

For More AP News and Telugu News

Updated Date - Jun 01 , 2025 | 08:44 AM