Share News

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:27 PM

Gowru Charitha Reddy: కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు.

Gowru Charitha Reddy: కుటుంబ సభ్యులకు జగన్ వెన్ను పోటు..
MLA Gowru Charitha Reddy

Kurnool Dist: జూన్ 4వ తేదీ (June 4th) ఏపీలో ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన రోజు.. రాష్ట్రంలో అరాచక పాలనకు బుద్ది చెప్పిన రోజు అయినందున బుధవారం ఉదయం సంక్రాంతి, సాయంత్రం దీపావళి సంబరాలు (celebrations) చేయాలని క్యాడర్‌కు కూటమి నేతలు (Alliance parties) పిలుపిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే (Panyam MLA) గౌరు చరితా రెడ్డి (Gowru Charitha Reddy).. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (YS Jagan)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సొంత చెల్లి, అమ్మను బయటికి గెంటేసి వెన్నుపోటు పొడిచారన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను 70 శాతం నెరవేర్చిందని, కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె అన్నారు.


అసలైన వెన్నుపోటు దారుడు జగన్..

కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు. కూటమి ప్రభుత్వంపై జగన్ ముఠా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సీఎం చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీని స్థాపించారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో తొలి ఏడాదిలోనే 70 శాతం హామీలను అమలు చేశామని, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ రూ.4 వేలకు పెంచామని, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మొదటి సంతకం మాట నిలబెట్టుకున్నామన్నారు. వైసీపీ దుష్ప్రచారాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆమె అన్నారు.


జగన్ పాలన అంతా రక్త చరిత్రనే...

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ.. జగన్ పాలన అంతా రక్త చరిత్రనే అని.. సొంత బాబాయి వివేకను గొడ్డలితో నరికి చంపారని, కుటుంబ సభ్యులను వెన్ను పోటు పొడిచారని, అందుకే తాము గొడ్డలి పోటుతో నిరసన తెలిపామని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండటం సైకో జగన్‌కు నచ్చడం లేదని, ప్రజల్లో విద్వేషాలు, గొడవలు రెచ్చ గొట్టేలా..రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్తున్నారని విమర్శించారు. సైకో జగన్ బ్యాచ్‌ను ప్రజలు ఇంకో సారి నమ్మి మోసపోయే పరిస్థితిలో లేరని రాజశేఖర్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ట్రంప్ మరో వాణిజ్య యుద్ధానికి తెర

సుపరిపాలన 4 ఏళ్లు కొనసాగాలి: ఎంపీ కేశినేని శివనాథ్

For More AP News and Telugu News

Updated Date - Jun 04 , 2025 | 05:19 PM