Yuvagalam Book: యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:51 PM
Yuvagalam Book: యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మంత్రి లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా యువగళం పుస్తకంపై లోకేష్ను పవన్ అభినందించారు.

అమరావతి, జూన్ 4: రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై (Yuvagalam Padayatra) రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు (Deputy CM Pawan Kalyan) మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అందజేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఈరోజు (బుధవారం) ఉదయం సచివాలయంలో పుస్తక ప్రతిని డిప్యూటీ సీఎంకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ను ఉపముఖ్యమంత్రి అభినందించారు. జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా యువగళం అంటూ యువగళం పుస్తకంపై పవన్ ప్రశంసలు కురిపించారు. అలాగే ఇతర మంత్రులకు కూడా మంత్రి లోకేష్ యువగళం పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతం అయ్యిందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేష్ను ప్రశంసించారు. ఈరోజుకు అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో యువనేత లోకేష్ పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి
కూకట్పల్లి డ్రగ్స్ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు
వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్
Read Latest AP News And Telugu News