Perni Nani: ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..
ABN , Publish Date - Jun 13 , 2025 | 07:26 AM
Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Krishna Dist: రేషన్ బియ్యం కేసు (Ration Rice Case) విషయంలో తన భార్య కోసం పోలీసులు (Police) విపరీతంగా ప్రయత్నించారని.. తన భార్యను తీసుకుని రోజుకోచోట దాక్కుంటూ 15 రోజుల పాటు తిరిగానని వైసీపీ కీలక నేత (YCP Leader), మాజీ మంత్రి పేర్ని నాని (Ex Minister Perni Nani) ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ‘తాను రాజకీయంగా చచ్చిపోవాలి.. రాజకీయాలను మానేయ్యాలి... ఎవరికీ ఇలాంటి దుస్థితి రాకూడదని’ ఆయన అన్నారు. అదృష్టవశాత్తూ బెయిల్ వచ్చిందని, అయినా వదలకుండా తన భార్యను పోలీసులు విచారించారని అన్నారు. తాజాగా నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆయన మచిలీపట్నంలో నిన్న (గురువారం) మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా తనను అరెస్టు చేయడానికి ఎలా వస్తారని ప్రశ్నించారు. వాళ్లు శునకానందం పొందడం తప్ప... ఏమీ చేయలేరని అన్నారు.
కాగా నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో కీలక సూత్రధారి, మాజీ మంత్రి పేర్ని నానితోపాటు ఆయన కుమారుడు పేర్ని కిట్టు అరెస్ట్కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ముందు ఓట్లు కోసం మచిలీపట్నంలో నకిలీ పట్టాలను పేర్ని నానితోపాటు పేర్ని కిట్టు పంపిణి చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రభుత్వాధికారులు విచారణ జరిపారు. దీనిలో వీరి ప్రమేయం ఉందని వారు నిర్ధారించారు.
త్వరలో వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టును పేర్ని నాని ఆశ్రయించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమేయం గానీ, తన కుమారుడు ప్రమేయం గానీ లేదని హైకోర్టులో పేర్ని నాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు... సుమారు 10 వేలు నకిలీ పట్టాలను పంపిణీ చేసినట్లు పేర్ని నానిపై అభియోగం వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
For More AP News and Telugu News