Home » Machilipatnam
Amravati Capital Reconstruction: మే 2న జరిగే అమరావతి నిర్మాణ పునఃప్రారంభ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతిపై కుట్రలు చేశారని మండిపడ్డారు.
మచిలీపట్నం పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా మచిలీపట్నంలో ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మరోవైపు బందరులో టూరిజం హబ్ ఏర్పాటు పనులు చేస్తున్నామని, సర్క్యూట్ టూరిజం అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు.
కోర్టు ఉత్తర్వులను పేర్ని నాని బేఖాతరు చేస్తూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. పేర్ని నానితో పాటు అతని కుమారుడు పేర్ని కిట్టు కూడా వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీపై అక్రమంగా ర్యాంప్ నిర్మాణం చేపట్టారు.
Bandar Laddu Secret Receipe : లడ్డూల్లో ఎన్నో రకాలున్నా.. ఆంధ్రప్రదేశ్లోని బందరు లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పేరు వినగానే స్వీట్ లవర్స్ నోరూరిపోవడం ఖాయం. ఇంట్లో తయారుచేసే ఈ లడ్డు ఇంత రుచిగా ఉండటానికి గల సీక్రెట్ ఇదే..
అధర్మంగా, దుర్గార్గంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరినీ ధర్మం శిక్షిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దూషించాడని, ఇంట్లో ఉన్న ఆడ బిడ్డల గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై అనుచిత పోస్టులు పెట్టే ఏ ఒక్కరినీ ఉపేక్షించమని స్పష్టం చేశారు.
ఓ ప్రముఖ బ్యాంకులో పెట్టిన ఖాతాదారుల గోల్డ్ నగలు రోల్డ్ గోల్డ్గా మారిపోయాయి. ఆ క్రమంలో ఏకంగా రూ. 1.70 కోట్ల విలువైన నగలు మాయమయ్యాయి. ఖాతాదారుల తనిఖీతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.
మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయం, గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
రేషన్ బియ్యం మాయం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట పోలీస్ స్టేషన్కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అయితే పోలీసులు నోటీసులు ఇచ్చే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు.