APPSC:గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసులో కీలక పురోగతి
ABN , Publish Date - May 06 , 2025 | 09:59 AM
వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్ను పోలీసులు A-2గా చేర్చారు.

అమరావతి: గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసు (Group-1 exam scam)లో విజయవాడ పోలీసులు (Vijayawada Police) కీలక పురోగతి సాధించారు. ఏపీపీఎస్సీ (APPSC) నియామకాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు (investigation) చేస్తున్నారు. ఈ కేసులో కామ్ సైన్ మీడియా (Comsign Media) ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన పమిడికాలువ మధుసూదన్ (Pamidikalva Madhusudan) ఇంటిలో పోలీసులు సోదాలు చేశారు. మధుసూదన్ను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. మంగళవారం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మాన్యువల్ (Mannuval) విధానం కాదని డిజిటల్ మూల్యాంకనం చేసి 1.14 కోట్ల రూపాయలు తీసుకున్న కామ్ సైన్ కంపెనీ డైరెక్టర్లలో మధుసూదన్ ఒకరు. డిజిటల్ మూల్యాంకనంకు వినియోగించిన ఎలెక్ట్రానిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధుసూదన్ను పోలీసులు A-2గా చేర్చారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని మీకు ఎవరైనా చెప్పారా... లేక ప్రభుత్వంలో ఎవరితోనైనా సిఫార్సు చేయించుకున్నారా.. అని పోలీసులు ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు..
కాగా వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలు వెలికితీస్తున్న విజయవాడ పోలీసులు కీలక ముందడుగు వేశారు. వైఎస్ అభిమాని, జగన్ సన్నిహితుడు ‘కామ్సైన్’ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన పమిడికాల్వ మధుసూదన్ను విజయవాడ పోలీసులు హైదరాబాద్లో సోమవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. వైఎస్ సహకారంతో మధుసూదన్ 2008లో ‘కామ్సైన్’ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు. కరోనా సమయంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. దీంతో ఈ కంపెనీని ఏ-2గా పేర్కొన్నారు. వాస్తవానికి మాన్యువల్ విధానాన్ని కాదని, డిజిటల్ మూల్యాంకనం చేసి రూ.1.14 కోట్లు తీసుకున్న కామ్సైన్ కంపెనీ డైరెక్టర్ హోదాలో ఆయనపై కేసు నమోదైంది. గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాల్లో అసలు సూత్రధారి అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు కాగా, రెండో నిందితుడిగా మధుసూదన్పై ఇటీవల సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్కు వెళ్లిన బెజవాడ పోలీసులు బంజారా హిల్స్లోని పంచవటి కాలనీలో ఉన్న కార్యాలయంలో మధుసూదన్ను ప్రశ్నించారు. అప్పట్లో ఏం జరిగింది.. ఏపీపీఎస్సీ కార్యాలయంలో కాకుండా ప్రైవేటు రిసార్ట్స్లో డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేశారు? అలా చేయమని పీఎస్ఆర్ ఆంజనేయులు చెప్పారా? ఏపీపీఎస్సీ నుంచి ఎవరైనా అడిగారా? మీరే ప్రభుత్వ పెద్దల నుంచి పైరవీ చేయించుకున్నారా? అని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పట్లో డిజిటల్ మూల్యాంకనానికి వినియోగించిన ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Also Read: 60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్లకు వివరించిన కోటంరెడ్డి
అక్రమాలకు వేదిక హాయ్ల్యాండ్
వైసీపీ హయాంలో పీఎ్సఆర్ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలోనే గ్రూప్-1లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఏపీపీఎస్సీ ఆఫీసుతో సంబంధం లేని గుంటూరు హాయ్ల్యాండ్ రిసార్ట్స్లో మూల్యాంకనం చేయించడమే అక్రమాలకు వేదికైంది. అయితే, ఆ తర్వాత మళ్లీ రెండోసారి మూల్యాంకనం చేయించినా, రెండుసార్లు జరిగిందనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం దాచిపెట్టింది. హాయ్ల్యాండ్ అనే పేరు కూడా తమకు తెలియదన్నట్టుగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొయింది. హాయ్ల్యాండ్లో మొదటిసారి మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్లు, చెల్లింపుల వివరాలను అభ్యర్థులు ఆధారాలతో సహా నిరూపించడంతో హైకోర్టు ఏకంగా మెయిన్స్ను కొట్టివేసింది. అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనుక చక్రం తిప్పింది పీఎస్ఆర్ ఆంజనేయులు అని విచారణాధికారులు భావిస్తున్నారు. 2018లో ఏపీపీఎస్సీ 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. దీనిలో మాన్యువల్ విధానం(చేతితో దిద్దే)లో మెయిన్స్ మూల్యాంకనం జరుగుతుందని పేర్కొంది. వైసీపీ హయాంలో 2020, డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్ పరీక్షలు జరగ్గా 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్ రాశారు. అయితే, కరోనా కారణం చూపుతూ ఏపీపీఎస్సీ మాన్యువల్గా కాకుండా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడంతో నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా(మాన్యువల్) మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతిపై కుట్ర.. ప్రభుత్వం సీరియస్..
For More AP News and Telugu News