Jagan: చంద్రబాబు గారూ అంటూనే జగన్ విమర్శలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:05 PM
YS Jagan: వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు.

Amaravati: ఏపీ (AP)లో రేషన్ పంపిణీ (Ration Distribution), వాలంటీర్ల తొలగింపు (Volunteers Removals)పై వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan) సోషల్ మీడియా ఎక్స్ (Social Media X) వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు (Comments) గుప్పించారు. చంద్రబాబు గారూ (Chandrababu Garu) అంటూనే విమర్శలు (Comments) చేశారు. ప్రజల ఇంటికే అందుతున్న సేవలపై ఎందుకు కక్ష.. మళ్లీ పేదలకు రేషన్ కష్టాలు ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ఆలోచించి ప్రజల అవస్థలను తీర్చాలి కానీ, వారిని కష్టపెట్టడం సబబేనా.. ప్రభుత్వ సేవల డోర్డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్ అవుతుందా అని నిలదీశారు.
ఇది ఎంత వరకు సమంజసం..
మరోవైపు వైసీపీ తీసుకొచ్చిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం, వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా... పారదర్శకంగా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తూ, వరదలు, విపత్తు సమయాల్లో బాధితులకు మరింతగా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా అని అన్నారు. పైగా ఈ సేవలందించిన వారిని ఉద్దేశిస్తూ వారు స్మగ్లర్లుగానూ, మాఫియా ముఠా సభ్యులు గానూ చిత్రీకరించేలా సీఎం చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాక ముందు ప్రతినెలా ఆహార భద్రత కింద పేదవాడికి హక్కుగా అందాల్సిన రేషన్ సహా ఎన్నో ప్రభుత్వ సేవలకోసం పడ్డ తిప్పలు అన్నీఇన్నీకావని అన్నారు.
Also Read: చాకలి కనకయ్య కుటుంబానికి ఆర్థిక సాయం...
దోపిడీకి అడ్డుకట్ట వేశాం..
ఎండనక, వాననక క్యూలైన్లలో రేషన్ షాపుల ముందు పడిగాపులు పడేవారని, ఎప్పుడు రేషన్ ఇస్తారో, ఎంతసేపు రేషన్ ఇస్తారో తెలియక కూలీ పనులు, ఇతరత్రా పనులు మానుకుని నిరీక్షించేవారని జగన్ అన్నారు. ఈ క్రమంలో లబ్ధిదారుల వివక్షను, అవమానాలు ఎదుర్కొనేవారని, దోపిడీకి గురయ్యేవారని, సరైన తూకంతో, నాణ్యతతో సరుకులు అందుకున్న సందర్భం లేదని విమర్శించారు. ఈ కష్టాలు పడలేక కొంతమంది రేషన్ సరుకులు తీసుకోవడం మానేశారని అన్నారు. దీనిపై తన పాదయాత్రలో ప్రజలు తన వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థలతోపాటు, ఇంటి వద్దకే రేషన్ అందించే డోర్డెలివరీని ప్రారంభించిందని అన్నారు. బియ్యం క్వాలిటీని పెంచి, మధ్యస్థ సన్నబియ్యాన్ని, ప్రజలు తినగలిగే నాణ్యమైన, సార్టెక్స్ చేసిన బియ్యాన్ని ప్యాక్చేసి, రేషన్ వాహనాల ద్వారా ప్రతి ఇంటింటికీ అత్యంత పారదర్శకంగా అందించి దోపిడీకి అడ్డుకట్ట వేశామన్నారు.
ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారు
ఇప్పుడు రేషన్ డోర్డెలివరీని రద్దు చేయడం, పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా అని జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారని నిలదీశారు. నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ వాలంటీర్లను కూటమి వైపు తిప్పుకుని ఎన్నికల్లో వాడుకుని, తీరా అధికారంలోకి వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడుతూ వారిని రోడ్డుమీద నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష కట్టి అందులో ఉన్న 33 వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారని దుయ్యబట్టారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు ఇలా అన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు.
20 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు..
గ్రామాల్లో, వార్డుల్లో డోర్డెలివరీ సంగతి పక్కనపెడితే, ఏకంగా ప్రభుత్వ సేవలు అందడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాజాగా ఈ మూర్ఖపు చర్య కారణంగా, రేషన్ వాహనాల తొలగింపుతో వారి కష్టాలు మరింత పెరిగాయని జగన్ అన్నారు. అంతేకాదు ఈ వాహనాలపై ఆధారపడ్డ 20 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని.. కనీసం వారికి ప్రత్యామ్నాం కూడా చూడలేదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మొత్తంగా కూటమి అధికారంలోకి వచ్చాక వాలంటీర్లుగా పనిచేస్తున్న 2.6 లక్షల మంది, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్లలో తొలగించిన వాటితో కలిపితే మొత్తంగా 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. ఏడాది పాలనలో ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం మీకు మాత్రమే సాధ్యం చంద్రబాబుగారూ.. అంటూ జగన్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ
ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..
For More AP News and Telugu News