AP Heavy Rains: అలర్ట్.. ఏపీలో ఉరుములు, మెరుపులతో వర్షాలు
ABN , Publish Date - May 20 , 2025 | 11:47 AM
AP Heavy Rains: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన విజయవాడ వాసులకు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.

అమరావతి, మే 20: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు.. అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. సూర్యుడి ప్రతాపంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిర అయిన విజయవాడ వాసులు మారిన వాతావరణంతో కాస్త ఉపశమనం పొందారు.
విజయవాడలో ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు కర్నాటకలోని గంగావతి, సిరుగుప్ప, హగరిలో కురిసిన వర్షాలకు తుంగభద్రలో ప్రవాహం పెరిగింది. దీంతో తుంగభద్ర ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. మంత్రాలయం వద్ద 308.300 నీటి మట్టం నమోదు అయ్యింది. కోసిగి మండల పరిధిలో ఆర్డీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Raj Bhavan Theft Case: రాజ్భవన్ చోరీ కేసులో మరో మలుపు
మరోవైపు ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు (మంగళవారం), రేపు(బుధవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుండగా.. కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు.. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
విషాదాలు
వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విషాదాలు చోటు చేసుకుంది. శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో తండ్రీ కొడుకులు పిడుగుపాటుకు గురయ్యారు. పిడుగుపాటుకు గురైన తండ్రి గేదెల రాజారావు మృతి చెందగా.. కుమారుడు గేదెల నాగార్జునకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నాగార్జునను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శ్రీకాకుళం నగరం బలగలో గ్రామ దేవత పండగల నేపథ్యంలో తండ్రీ, కొడుకులు నదిలో స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
అటు కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో నాటు పడవ బోల్తా పడింది. ఉప్పాడ తీరం నుంచి ముగ్గురు వ్యక్తులు నాటు పడవపై సముద్రం మధ్యలో ఉన్న హోప్ హైలాండ్కు వెళ్తుండగా కెరటాల తాకిడికి పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఈదుకుంటూ సురక్షితంగా హోప్ ఐలాండ్ చేరుకోగా.. మెరుగు శ్యామ్(20) అనే యువకుడు గల్లంతయ్యాడు.
ఇవి కూడా చదవండి
JN.1 COVID 19 Variant: కొవిడ్ కేసుల పెరుగుదల.. ఏమిటీ జేఎన్.1 కరోనా వేరియంట్
US: అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News