Share News

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:11 AM

మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు.

Liquor Scam: కసిరెడ్డికి నో బెయిల్‌

  • పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

  • మరోసారి బెయిల్‌ పిటిషన్‌ వేసిన సజ్జల శ్రీధర్‌రెడ్డి

విజయవాడ, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీనికి సంబంధించిన తీర్పును ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారం వెలువరించారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఇటీవల ఏసీబీ కోర్టులో కసిరెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ అధికారులను ఆదేశిస్తూ విచారణను కోర్టు శనివారానికి వాయిదా వేసింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన సదుపాయాల కల్పన పిటిషన్‌పై తీర్పును న్యాయాధికారి 30కి వాయిదా వేశారు.

Updated Date - Jun 28 , 2025 | 05:11 AM