Home » ACB
రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాల్లో అక్రమాలు, లంచాల ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి.
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, కడప, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేశారు.
ప్రకాశం జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం రేగింది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన నామన కృష్ణ మోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు సోమవారం విసృత తనిఖీలు చేపట్టారు. డీసీసీబీ కాలనీలోని అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో విస్తృత సోదాలు నిర్వహించారు.
కడప జిల్లా పులివెందులలో భారీ అవినీతి తిమింగలాలపై ఏసీబీ అధికారులు జరిపిన మెరుపు దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఏసీబీ అధికారులు సీఐ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.
సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి హయాంలో.. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఎండీగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మద్యం పాలసీ రూపకల్పన, కంపెనీల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు..
పెద్దపల్లి జిల్లా మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. సోదాలకు ముందు డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్.. ఓ రైతు నుంచి రూ.16,500ల లంచాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు..
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్లోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ (గురువారం) సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు..
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.