Government Job: ఉద్యోగ వయోపరిమితి 42 ఏళ్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:40 AM
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

యూనిఫాం సర్వీసులకు రెండేళ్లు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగార్థుల వయోపరిమితిని 42 ఏళ్లుగా కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ యూనిఫాం సర్వీసుల ఉద్యోగాలకు గతంలో పెంచిన గరిష్ఠ వయోపరిమితిని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీపీఎస్సీ, ఇతర బోర్డులు భర్తీ చేసే యూనిఫాం సర్వీసుల పోస్టులకు వయోపరిమతిని రెండేళ్లు పెంచారు. ఈ సడలింపు ఈ సంవత్సరం సెప్టెంబరు వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read:
లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్
For More Andhra Pradesh News and Telugu News..