Home » Jobs
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విద్యుత్ శాఖ పోస్టుల భర్తీ, ఏయూ ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రి వినతులు స్వీకరించారు.
ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు.
ఉద్యోగం రావడం లేదని జీవితంపై విరక్తితో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్లో ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు..
పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులే లక్ష్యంగా కేటుగాళ్లు పంజా విసిరారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అంటూ కలలు చూపించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. నర్సాపురం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
దేశవ్యాప్తంగా ఇవాళ జరిగిన 18వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 61,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. మొత్తం నియామకాల్లో 49,200 మంది హోం మంత్రిత్వ శాఖ, పారామిలిటరీ దళాల్లో ఉద్యోగాలు సాధించారు.
ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన జాబ్ ఫ్రాడ్ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. ‘అబ్దుల్ కలామ్ ఓఎస్డీ’ అని తనను తాను పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, గ్రూప్ వన్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసినట్లు బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం కొంతమంది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగాలు, అధిక వడ్డీ ఆశలు చూపిస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు. అసలు నిజం తెలిసి బాధితులు లబోదిబో అంటున్నారు.
కడప జిల్లాలోని పట్టణ ప్రాంతంలో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులకు మెరుగైన జీవనోపాదులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మెగా జాబ్మేళాను శనివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.