Share News

ఓ..టరన్‌!

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:41 AM

మాకేంటి అని బింకాలు పలికిన నాయకులను మూలన కూర్చోపెట్టింది.. మరో 30 ఏళ్లు మాదేనంటూ విర్రవీగిన నాయకులను ఇళ్లకే పరిమితం చేసేసింది.. రాక్షస పాలనకు ఓటు చరమగీతం పాడింది. గోదారంతా ఫ్యాన్‌ను ఊడ్చి కొట్టారు..సరిగ్గా ఇదే రోజు గతేడాది జూన్‌ 4న కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయక త్వంలో అభివృద్ధిని చూస్తున్నారు..ఆ రోజులు.. ఏడాదిలో ఈ రోజులు బేరీజు వేసుకుంటూ హమ్మయ్య అంటూ గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు..

ఓ..టరన్‌!

ఐదేళ్లు విసిగి.. ఫ్యాన్‌ అంతం చూశారు!

వైసీపీ అరాచకపాలన అంతమై నేటికి ఏడాది

ఐదేళ్లలో ప్రజలను పీడించేసిన జగన్‌ సర్కారు

విసుగెత్తి, విరక్తితో ఫ్యాన్‌ను ముక్కలు చేసిన ఓటర్లు

ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు దక్కని వైసీపీ

నాడు కూటమికి జైకొట్టిన ప్రజానీకం

ఓటు ఏం చేయగలదు..?

ఓటు వజ్రాయుధం ఎలా?

ఓటుతో భవిష్యత్‌ ఎలా మారుతోంది?

ఓటుకు ఉన్న సత్తా ఏమిటి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 2024..

ఓటుకు నోటేశారు..

భయపెట్టి నోటీకి తాళాలు వేసేశారు..

మరో 30 ఏళ్లు అధికారం మాదే

అంటూ బింకాలు పలికారు..

ఓటరు ఊరుకున్నాడు.. ఊరుకున్నాడు..

ఐదేళ్లూ చూశాడు.. చూశాడు..

2024లో అతని రోజు రానే వచ్చింది..

ఓటు శాసించింది..

మాకేంటి అని బింకాలు పలికిన నాయకులను మూలన కూర్చోపెట్టింది.. మరో 30 ఏళ్లు మాదేనంటూ విర్రవీగిన నాయకులను ఇళ్లకే పరిమితం చేసేసింది.. రాక్షస పాలనకు ఓటు చరమగీతం పాడింది. గోదారంతా ఫ్యాన్‌ను ఊడ్చి కొట్టారు..సరిగ్గా ఇదే రోజు గతేడాది జూన్‌ 4న కూటమికి పట్టం కట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయక త్వంలో అభివృద్ధిని చూస్తున్నారు..ఆ రోజులు.. ఏడాదిలో ఈ రోజులు బేరీజు వేసుకుంటూ హమ్మయ్య అంటూ గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారు..

-(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఆ ఐదేళ్లు తల్చుకుంటేనే వణుకు.. అధికారం ముసుగులో అంతటా అరాచకం..పేట్రేగిపోయిన విచ్చలవిడితనం.. రాత్రి8 గంటలు దాటిన తరువాత బయలకు వెళ్లాలంటేనే బ్లేడ్‌ బ్యాచ్‌లతో భయం భయం.ఓట్లేసి గెలిపించి నందుకు ప్రజలను పీడించేయడం.. సహజవనరుల లూటీ.. భూ కబ్జాలు..బెదిరింపులు.. ప్రశ్నిస్తే కేసు లు..ప్రజల సొంత ఆస్తులపై సైతం కన్నేసి కాటే యడం...డ్రైవర్‌ను హత్య చేసి మృత దేహాన్ని ఇంటికే డోర్‌ డెలివరీ చేయడం.. పోలీసులే నిందితుడికి రక్షణ ఇవ్వడం..ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులు..వాటిపై ప్రయా ణిస్తే ప్రాణం హరీ అనే పరిస్థితులు.. వైసీపీ ఐదేళ్ల పాలన ప్రజ లకు ప్రత్యక్ష నరకం చూపించింది. వీటిన్నింటిపై విసిగెత్తిపోయిన ప్రజలు సరిగ్గా ఏడాది కిందట ఓటుతో కసితీరా వైసీపీని వేటాడారు. ఓట్లతో దండయాత్ర చేసి వైసీపీ పీడను విరగడ చేశారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాన్‌ను ముక్కముక్కలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ కూట మికి పట్టం కట్టారు. మొత్తం 21 సీట్లకు 21 చోట్లా గెలిపించి బ్రహ్మరథం పట్టారు.అదే సమ యంలో తొలిసారి జనసేన సత్తా చాటింది. పోటీచేసిన అన్నిచోట్లా విజయ దుందుభి మోగించింది.

ఆ ఐదేళ్లూ ఎంత విరగబాటో...

2019 మే 23...ఒక్క ఛాన్స్‌ అంటూ రకరకాల మోసపూరిత హామీ లతో జగన్‌ జనాన్ని వంచించి గెలిచిన రోజు.. అదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు పెనుశాపంగా మారుతుందని ఎవరూ ఊహించ లేదు.ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టించింది. ఆ పార్టీ నేతలు..ఎమ్మెల్యేలు...సీఎం జగన్‌ అండదండలు, సహకారంతో జిల్లా ను లూటీ చేసేశారు.తొలుత పేదల ఇళ్ల స్థలాల పేరుతో అవినీతిని ఆరంభించి అక్రమ ఇసుక తవ్వకాలు, గ్రావెల్‌తో పరాకాష్టకు చేర్చా రు.కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కన్నబాబు, కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తదితరులు ఇళ్ల స్థలాలు,చదునులో సంపాదించిన దానికి అంతే లేదు. ఇసుకలో వందల కోట్లతో పడగలెత్తారు. జగన్‌ అండతో వైసీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు.జగన్‌ సర్కారు రకరకాల పన్నుల వాత, విద్యుత్‌ బిల్లుల పెంపుతో జనం నడ్డివిరిచేసింది. మందు బాబులకు షాక్‌ ఇచ్చారు. కల్తీ మద్యం అమ్మకాలు పెంచేశారు. జిల్లాలో ఐదేళ్ల పాటు రహదారులను గాలికొదిలేయడంతో ఎందరో ప్రమాదాలకు గురై మరణించారు.అటు రీసర్వే పేరుతో ప్రజలను జగన్‌ ప్రభుత్వం భయపెట్టింది.ల్యాండ్‌ టైటలింగ్‌ యాక్ట్‌ పేరుతో జనం భూములను కొట్టేసేందుకు సైతం వెనుకాడలేదు. ప్రతి వస్తువుపై బొమ్మలు ము ద్రించి జగన్‌ నయా కిమ్‌ను తలపించారు. అటు జిల్లాల విభజన పేరుతో కోన సీమలో అల్లర్లు రాజేశారు. సీతానగరం నుంచి కాకినాడ వరకు ఎందరో ఎస్సీ యువతపై వైసీపీ పాలకులు దాడులు,హత్య లకు దిగారు. చివరకు ప్రభుత్వ వైఫ ల్యాలను ప్రశ్నించిన ప్రతిపక్ష టీడీపీపై అక్రమ కేసులు నమోదు చేయించింది. ఇలా అక్రమాలు, అరాచకాలు, బెదిరింపు లు ,నియంత విధానాలతో వైసీపీ తన చీకటి పాలన కొనసాగించి ప్రజాస్వామ్యానికి పాతరేసింది.


ఓటేం చేయగలదంటే..

సరిగ్గా 2024 మే 13.. జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు.. ఐదేళ్ల వైసీపీ పాలనతో విసుగెత్తి పోయిన జిల్లా ఓటర్లు అరాచకపాలన అంతమొందించడానికి ఏకమ య్యారు. ఓ ఉద్యమం తరహాలో.. కదం తొక్కా రు. అన్ని వర్గాలు ఓటుతో కదిలారు. బూత్‌ల వద్ద దండెత్తారు. అర్థరాత్రి పన్నెండు దాటినా..ఓపక్క వర్షం పడు తున్నా బూత్‌ల నుంచి అడుగుకూడా వెనక్కు వేయలేదు. కసి తీరా ఓటు హక్కు వినియోగించి వైసీపీ అరాచక పాలనకు అంతం పలికారు.ఆ ఏడాది జూన్‌ 4న ఎన్నికల ఫలితాల రోజు పండగ వాతావరణం నెలకొంది. ఓ నియంత పాలనకు చరమగీతం పడింది.నరకాసుర వధ జరిగిందంటూ ప్రజలు ఆనందంతో రోడ్డెక్కారు. బాణ సంచా కాల్చి పండుగ చేసుకున్నారు.

కూటమికే కట్టబెట్టారు

ఉమ్మడి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా ఓటర్లు ఫ్యాన్‌ రెక్కలు విరిచేశారు.చరిత్రను సైతం తిరగరాసిన ఈ ఫలితాల్లో కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 21 సీట్లకు 21 సీట్లు టీడీపీ కూటమి గెల్చుకుని సత్తా చాటింది. నోటుకు ఓటు పడుతుందన్న వైసీపీ భ్రమలను ఓటర్లు చిత్తుచేశారు. గతేడాది వచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్‌ స్థానాల పరిధిలో 21 సీట్లకు టీడీపీ 16, జనసేన 6, బీజేపీ ఒక స్థానంలో విజయ దుందుభి మో గించాయి. అటు జనసేన ఉమ్మడి తూర్పులో తొలిసారి అద్భుత ఫలితాలు సాధించింది.గతంలో ఎన్నడూ రానంత మెజార్టీలు కూటమి ఎమ్మెల్యేలకు ఓట ర్లు కట్టబెట్టారు. మూడు పార్లమెంట్‌ స్థానాలు కూటమి కైవసం చేసు కుంది. ఒకరకంగా చెప్పాలంటే గతేడాది వెలు వడిన ఫలితాల్లో గోదావరి ఓటర్ల ఆగ్రహావేశాల ప్రవాహంలో వైసీపీ కొట్టుకుపోయి గల్లంతైపోయింది. ప్రజా వేశంతో ఫ్యాన్‌ తునాతునకలైంది.ఓటు దెబ్బకు కుదేలైపోయింది.

Updated Date - Jun 04 , 2025 | 01:41 AM