Share News

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:38 AM

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.

Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే
Tirumala Temple

తిరుపతి, జూన్ 7: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో (Tirumala) నిరంతరం భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక వారాంతాలు, సెలవుల్లో అయితే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇప్పుడు మరో వారంలో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. దీంతో చాలా మంది శ్రీనివాసున్ని దర్శించుకునేందుకు తిరుమల బాటపట్టారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వారాంతపు సెలువు, స్కూళ్ల రీఓపెన్ ఉండటంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దీంతో అలిపిరి టోల్ గేట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.


తమ పిల్లలు చదువుల్లో ఉత్తీర్ణత సాధించాలని, తిరుమల కొండకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటామని భక్తులు మొక్కుకుంటారు. దీంతో ఆ మొక్కులు తీర్చుకునేందుకు సెలవులు కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ట్యాక్సీలు, తమ తమ సొంత వాహనాల్లో భక్తులు శ్రీవారి కొండకు రావడంతో అలిపిరి వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు టీటీడీ ఉన్నతాధికారులు అలిపిరి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ రద్దీ మాత్రం విపరీతంగా ఉంది. అటు తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


ఇక భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో పాటు బయట శిలా తోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యే ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న (శుక్రవారం) శ్రీవారిని 72,174 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 35,192 మంది భక్తులు తలనీలాలు ఇచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ద్వారా రూ.2.88 కోట్ల ఆదాయం వచ్చింది.


ఇవి కూడా చదవండి..

ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి

కొత్త పార్టీ పెడుతున్న మస్క్.. పేరు ఏంటంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 11:49 AM