Naksha: ‘నక్ష’తో ఖచ్చితమైన పట్టణ ప్రణాళిక
ABN , Publish Date - May 30 , 2025 | 12:43 AM
పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది.

కుప్పం, మే 29 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది. నక్ష సర్వేతో ఇకమీదట భూమి రికార్డులు పారదర్శకంగా అందరికీ అందుబాటులోకి రానున్నాయి. కుప్పం మున్సిపాలిటీలో ఈ సర్వే ప్రస్తుతం జోరుగా సాగుతోంది. నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్బ్ ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష) సర్వే ప్రాజెక్టుకోసం కేంద్ర ప్రభుత్వం దేశంలోని 150 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో 10 ఎంపికయ్యాయి. ఇందులో కుప్పం మున్సిపాలిటీ ఒకటి.ప్రస్తుతం కుప్పంతోపాటు అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో నక్ష సర్వే కొనసాగుతోంది. ఇక కుప్పం పురపాలక సంఘం విషయానికి వస్తే మొత్తం 34 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇందులో ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు కలిపి సుమారు 6 వేల దాకా ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నివాస గృహాలు 13 వేలున్నాయి. కుప్పం పురపాలక సంఘంలో డ్రోన్ సర్వే ఇప్పటికే పూర్తయింది. మున్సిపాలిటీ పరిధిలో ఉండే భూమి మొత్తాన్ని ఆర్దో రెక్టిఫైడ్ ఇమేజె్సగా రూపొందించారు ఈ సర్వే ద్వారా ఇంకా ల్యాండ్ పార్సిల్ మ్యాఫ్ (ఎఫ్ఎంబీ) తయారు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నక్ష సర్వే గ్రౌండ్ ట్రూథింగ్ స్టేజ్లో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తుల సర్వేనే ప్రారంభించారు.
నక్ష సర్వే అంటే ఏమిటి?
నక్ష సర్వే అంటే అత్యాధునిక సర్వే పద్ధతులను ఉపయోగించి, ఎవరి భూమి మీద హక్కును వారికి పక్కాగా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా దఖలుపరచడం. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు సంబంధించిన ఆస్తులను పక్కాగా కొలతలు వేసి, ఎఫ్ఎంబీలు రూపొందించడమే నక్ష సర్వే లక్ష్యమంటున్నారు అధికారులు. నక్ష సర్వే ద్వారా ముందుగా పురపాలక సంఘం పరిధిలోని మొత్తం భూ భాగాన్ని డ్రోన్ల ద్వారా ఆర్దో రెక్టిఫైల్ ఇమేజె్సగా రూపొందిస్తారు. అనంతరం ఈ ఇమేజె్సను అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను పక్కాగా అంచనా వేసి ఎఫ్ఎంబీ రూపొందిస్తారు. దీన్ని రూపొందించే ముందు ప్రజలకు నోటీసులు ఇస్తారు.ఆస్తుల హక్కు పత్రాలను సమర్పిస్తే, దాని ప్రకారం సర్వే కూడా చేస్తారు. ఏదైనా తేడాలుంటే అప్పటికప్పుడు పరిష్కరిస్తారు. దీనికి ముందు రోవర్ల ద్వారా పక్కా కొలతలు తీస్తారు. భూముల రికార్డులను ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా భద్రపరచడానికి, ఆస్తులపై పక్కా హక్కును ప్రజలకు దఖలు పరచడానికి మాత్రమే నక్ష సర్వే ఉపయోగపడుతుందని అదికారులు చెబుతున్నారు. సర్వే ఆఫ్ ఇండియా దిశానిర్దేశకత్వంలో కుప్పం మున్సిపాలిటీలో ఫిబ్రవరి నెలలో మొదలైన నక్ష సర్వేని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
నక్ష సర్వేపై అపోహలు వద్దు : కమిషనర్ శ్రీనివాసరావు
నక్ష సర్వేపైన అపోహలు పెట్టుకోవద్దు. మీ ఆస్తులను పక్కాగా డిజిటలైజేషన్ చేసి పట్టాలు ఇవ్వడానికే ఈ సర్వే జరుగుతోంది. ఆన్లైన్లో పారదర్శకంగా ఆయా ఆస్తుల వివరాలు యజమానుల పేరుతో సహా నమోదవుతాయి. నక్ష సర్వే అంటే ప్రజల ఆస్తుల డిజిటలైజేషన్ మాత్రమే. ఆస్తి పన్ను పెంచడానికో ఆస్తులను లాక్కోవడానికో ఈ సర్వే జరగడంలేదు. సర్వేకోసం తమ వద్దకు వచ్చే మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలి.