Home » Kuppam
చీరాల కుప్పడం చీరకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి(ఓడీఓపీ) కింద కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివాదాలకు ఇక చోటు లేకుండా పోనుంది. భూ రికార్డుల రిజిటలైజేషన్తో పక్కాగా ప్రజలకు వారివారి ఆస్తులమీద హక్కు దక్కనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వ నియోజకవర్గమైన కుప్పంలో శివపురంలో కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలే అతిథులుగా పాల్గొన్నారు.
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. ఈ నేపథ్యంలో కుప్పంలో ప్రతి ఇంటా సందడి నెలకొంది. సొంత కుటుంబ సభ్యుడే గృహప్రవేశం చేస్తున్నట్లు కుప్పం వాసులంతా సంతోషం వ్యక్తం చేశారు.
మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజల అభిమానంతో కూడిన సీఎం చంద్రబాబు, శివపురం గ్రామంలో కొత్త ఇంటి గృహప్రవేశం జరుపుకోబోతున్నారు. భువనేశ్వరి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, ఆదివారం కుటుంబసభ్యులతో కలిసి కొత్త ఇల్లు వద్ద గడుపుతున్నారు.
కుప్పంలో మంగళవారం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరస్సు ఊరేగింపు ఘట్టం నభూతో.. న భవిష్యతి అన్నట్టుగా సాగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు సర్వం సిద్ధమైంది. కుప్పంలో జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాలలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూప దర్శనం బుధవారం జరగనుంది.
చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. కుప్పంలో ముగ్గురు, బుట్టాయగూడెంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ జల సమాధి చెందారు.
కుప్పానికి ‘వాహన’యోగం పట్టింది. రెండు అంబులెన్స్లు, నాలుగు ఈ-ఆటోలు ఇప్పటికిప్పుడు రావడమే కాదు, ఇంకో 90 దాకా ఈ-ఆటోలకు ఒప్పందం కుదిరింది. ఒప్పందమంటే ఇదేదో నగదు చెల్లించే పరస్పర ఒప్పందం కాదు, ఉచితంగా అన్ని ఆటోలూ కుప్పం చేరబోతున్నాయి.