AP Schools: నేటి నుంచే బడులు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:02 AM
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...

తొలిరోజే విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ
233 రోజులు బడి.. 83 సెలవులు
2025 అకడమిక్ క్యాలెండర్ విడుదల
పాఠశాలల పునఃప్రారంభానికి మోగిన గంట
విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ నేటి నుంచే
గణితానికి అత్యధికంగా 40 పీరియడ్లు
ప్రతి శనివారం నో బ్యాగ్ డే
అన్ని పరీక్షలూ రాసేది ఒక్క పుస్తకంలోనే
మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు నేటి నుంచే విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించనుంది. కిట్లో బ్యాగు, యూనిఫాం, బూట్లు, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బెల్టు, డిక్షనరీ ఉంటాయి. అలాగే పాఠశాలల్లో నేటి నుంచి సంసిద్ధత కార్యక్రమాలు చేపడతారు. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇక, ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు బడులు నిర్వహిస్తారు. 83 రోజులు వివిధ రూపాల్లో సెలవులు ఉంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలకు వేర్వేరుగా క్యాలెండర్లు రూపొందించింది. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 10 వరకు దసరా సెలవులు, జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. సబ్జెక్టుల వెయిటేజీని పరిశీలిస్తే గణితం సబ్జెక్టుకు అత్యధికంగా 40 పీరియడ్లు కేటాయించారు. తెలుగుకు 30, హిందీకి 25, ఇంగ్లీష్కు 30, బయాలజీకి 30, ఫిజిక్స్కు 18, సోషల్కు 30 పీరియడ్లు కేటాయించారు.
నవంబరు 10 నుంచి 19 వరకు సమ్మేటివ్ అసె్సమెంట్-1 పరీక్షలు, ఏప్రిల్ 6 నుంచి 15 వరకు సమ్మేటివ్ అసె్సమెంట్-2 పరీక్షలు జరుగుతాయి.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రాథమిక తేదీలను ఈసారి ముందుగానే ప్రకటించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగేలా షెడ్యూలు రూపొందించారు. మార్చి 2 నుంచి 12 వరకు టెన్త్ విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. అలాగే పబ్లిక్ పరీక్షలకు ముందు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తారు.
ఐదు నుంచి ఆరో తరగతికి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 40 రోజుల సంసిద్ధత కార్యక్రమం నిర్వహిస్తారు. టీచర్- విద్యార్థి మధ్య ఇంటరాక్షన్, వకాబులరీ బిల్డింగ్ లాంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఆరో తరగతి సాధారణ సిలబ్సతో పాటు ఇది కొనసాగుతుంది.
6-10 తరగతుల విద్యార్థులకు రాజ్యాంగం పుస్తకం కూడా ఇస్తారు. షెడ్యూలు ప్రకారం ప్రతినెలా అందులోని అంశాలపై బోధన కొనసాగుతుంది.
8, 9, 10 తరగతుల విద్యార్థులను ఎంపిక చేసి అమరావతిలోని అసెంబ్లీలో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహిస్తారు. విద్యార్థుల్లో రాజకీయ అక్ష్యరాస్యతను పెంచడం దీని లక్ష్యం. క్షేత్రస్థాయిలో క్విజ్లు నిర్వహించి ఫైనల్గా రాష్ట్రస్థాయి అసెంబ్లీకి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
జూన్ 25, నవంబరు 25న మెగా పేరెంట్- టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తారు. మరో ఐదు సాధారణ పేరెంట్- టీచర్ సమావేశాలు నిర్వహిస్తారు.
గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా భాషా పండుగ నిర్వహిస్తారు. ఆగస్టు 28 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం చేపడతారు.
గురజాడ అప్పారావు, గుర్రం జాషువాల జయంతుల సందర్భంగా సెప్టెంబరు 21 నుంచి 29 వరకు తెలుగు భాషా వారోత్సవాలు నిర్వహిస్తారు.
6- 9 తరగతుల విద్యార్థులకు ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ఉంటుంది. ఆ రోజుల్లో విద్యార్థులకు స్కిల్ టెస్ట్, క్లబ్ కార్యకలాపాలు, స్పోకెన్ ఇంగ్లీష్, వృత్తి విద్య, మాక్ పార్లమెంట్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా విద్యార్థులకు అసె్సమెంట్ బుక్లెట్ అందిచబోతున్నారు. ఈ బుక్లెట్లోనే విద్యార్థులు అన్ని పరీక్షలూ రాయాలి. టీచర్లు అందులోనే మార్కులూ వేస్తారు. దానివల్ల టీచర్లు, తల్లిదండ్రులు... విద్యార్థుల ప్రగతి ఎలా ఉంది అనేది ఆ పుస్తకంలో చూసి తెలుసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు ఒక బుక్లెట్ ఉంటుంది.
1-5 తరగతుల ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు, గణితంకు అత్యధికంగా 44 చొప్పున పీరియడ్లు కేటాయించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ఉంటుంది. గూగుల్ రీడ్ యాప్ ద్వారా ఇంగ్లీష్ వినడం, మాట్లాడటం నేర్పిస్తారు. వీరికి కూడా స్టూడెంట్ అసె్సమెంట్ బుక్లెట్ ఇస్తారు. విద్యార్థులు అన్ని పరీక్షలు అందులోనే రాయాలి.