Anathapuram: ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:57 AM
అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి...

ప్రమాదకర ద్రావణం పోసిన ఆనవాళ్లు
పూర్తిగా కాలిపోయిన ముఖం.. జుత్తు
శరీరంపై కాలిన గుర్తులు.. బొబ్బలు
అనంతలో ఘటన.. మృతదేహం లభ్యం
ముగ్గురు యువకులపై అనుమానం
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతపురం క్రైం, జూన్ 8(ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. స్థానిక రామకృష్ణ కాలనీకి చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి(19) నగరంలోని వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదివింది. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో గాలించినా జాడ తెలియలేదు. దీంతో 4న వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేరోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 7న కూడేరు మండలం గొట్కూరు సమీపంలో అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని శవం ఉందని పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన్మయి తల్లిదండ్రులు.. అక్కడికి చేరుకుని, మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు. కాగా యాసిడ్ వంటి ప్రమాదకర ద్రావణాన్ని ఆమెపై పోసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, బాలు అనే యువకుడు గతంలో వేధించాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. న్మయి రాయదుర్గానికి చెందిన బాలు, అనంతపురం ఐదోరోడ్డులో ఉంటున్న నరేశ్, ఫెర్రర్నగర్కు దినేశ్తో స్నేహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు నరేశ్, బాలు అనే యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దినేశ్ కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు.