Tdp : మా పనుల వద్ద మీ ఫోజులేమిటి..?
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:41 AM
‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మేము పనులు చేయిస్తుంటే.. మీరు ఫొటోలు తీయించుకుని ఫోజులు కొడతారా..?’ అంటూ మేయర్ వశీంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుల్జార్పేట్, ఇతర ప్రాంతాలలో కార్పొరేషన సిబ్బంది పారిశుధ్య కల్పన, ఇతర పనులు చేస్తున్నారని కార్పొరేటర్ బాబా ఫకృద్దీన, టీడీపీ నాయకులు ముస్తాక్, ఖలందర్, మోహనకుమార్ అన్నారు. అక్కడికి వెళ్లి ...

మేయర్పై టీడీపీ నాయకుల మండిపాటు
అనంతపురం అర్బన, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ‘ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మేము పనులు చేయిస్తుంటే.. మీరు ఫొటోలు తీయించుకుని ఫోజులు కొడతారా..?’ అంటూ మేయర్ వశీంపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో గుల్జార్పేట్, ఇతర ప్రాంతాలలో కార్పొరేషన సిబ్బంది పారిశుధ్య కల్పన, ఇతర పనులు చేస్తున్నారని కార్పొరేటర్ బాబా ఫకృద్దీన, టీడీపీ నాయకులు ముస్తాక్, ఖలందర్, మోహనకుమార్ అన్నారు. అక్కడికి వెళ్లి మేయర్ ఫొటోలు దిగడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన సొంత డివిజనలో
పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తోందని, ముందుగా వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికైనా చేయని పనుల వద్ద ఫొటోలు దిగడం మానుకోవాలని హితవు పలికారు.
సర్.. మేడమ్.. నిధులివ్వండి: దగ్గుపాటి
అనంతపురంలోని నడిమి వంక, మరువ వంకకు ఇరువైపులా ప్రొటెక్షన వాల్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కోరారు. అమరావతిలో మంత్రిని బుధవారం ఎమ్మెల్యే కలిశారు. పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలు కురిసిన సమయంలో వంకలు పోటెత్తి డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతోందని, కాలనీలు మునిగిపోతున్నాయని మంత్రికి వివరించారు. ప్రొటెక్షన వాల్స్ నిర్మాణం కోసం రూ.88 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కలిసి వినతిపత్రం అందజేశారు. గిల్డాఫ్ సర్వీస్ స్కూల్ ఆవరణలోని పురాతన భవనాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మంత్రికి వివరించారు. భవనాలకు మరమ్మతులు చేయించాలని, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనపు భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్లోని మెస్, కాస్మెటిక్ చార్జీలు చెల్లించాలని కోరారు. ఉపకార వేతనాలు పోస్ట్ మెట్రిక్ రూ.2.3 కోట్లు, ఫ్రీ మెట్రిక్ రూ.1.11 కోట్లు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే వాటిని మంజూరు చేయాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...