• Home » 2025

2025

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

OFFICES: ఇరుకు గదుల్లో సచివాలయ సేవలు

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్‌లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

BUS STOP: బస్‌షెల్టర్‌ లేక ఇబ్బందులు

మండలకేంద్రంలో బస్‌ షెల్టర్‌ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్‌ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.

RDO: వాల్టాను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో

RDO: వాల్టాను అతిక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీవో

వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్‌ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్‌ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్‌ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.

FORMER MINISTER: పేదలకు తోడ్పాటు అందించాలి

FORMER MINISTER: పేదలకు తోడ్పాటు అందించాలి

ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్‌ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.

OFFICES: ఒకే గదిలో మూడు సచివాలయాలు

OFFICES: ఒకే గదిలో మూడు సచివాలయాలు

మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

UTF: ఇనసర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి

UTF: ఇనసర్వీస్‌ టీచర్లకు టెట్‌ మినహాయించాలి

ఇన సర్వీసు టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్మవరం, పుట్టపర్తి, కదిరి పట్టణాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మ హేశకు వినతిపత్రం అందజేశారు.

FORMER MINISTER: అభివృద్ధిని ఓర్వలేక శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు

FORMER MINISTER: అభివృద్ధిని ఓర్వలేక శ్రీధర్‌రెడ్డి ఆరోపణలు

సత్య సా యి బాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్లిఓ జ రిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నా రని మాజీమంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదుచేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు.

TDP: కార్యకర్తలకు అండగా పార్టీ

TDP: కార్యకర్తలకు అండగా పార్టీ

కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని టీ డీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ముదిగుబ్బ మండలం ఎనుములవారిపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గంగులప్ప రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గంగులప్పకు టీడీపీ సభ్యత్వం ఉండడంతో పరిటాల శ్రీరామ్‌ చొరవ తీసుకొని వివరాల్ని పార్టీ కార్యా లయానికి పంపారు.

FOOLD COMMISSION :ఏమిటీ ఆహారం ?

FOOLD COMMISSION :ఏమిటీ ఆహారం ?

కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్‌ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్‌ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.

ROAD: దారి పొడవునా కంపచెట్లు

ROAD: దారి పొడవునా కంపచెట్లు

మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి