Home » 2025
ఏపీ డీఎస్సీ - 2025 నియామక పరీక్షలు వాయిదా పడ్డాయి. యోగా దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఈ నియామక పరీక్షలు వాయిదా వేసినట్టు డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.
మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది.
మెగా డీఎస్సీ పరీక్షలు రెండో రోజు ఆదివారం ప్రశాంత వాతావరణంలో జరిగాయని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం సెషన్లో 9,951 మంది అభ్యర్థులకు గాను...
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని శనివారం హెచ్చెల్సీ కాలనీలో గల కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
మండలపరిధిలోని వెలి చలమల క్రాస్ అంధకా రంలో మగ్గుతున్నట్లు స్థానికులు వా పోతు న్నారు. విద్యుత స్తంభా లకు ఏర్పాటుచేసిన బ ల్బులు వెలగడం లేదం టున్నారు. దీంతో రాత్రిళ్లు బయటకు రావాలంటే భ యపడుతున్నట్లు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల వ్యాప్తంగా పలువురు రైతులు బూడిద గుమ్మడి పంట సాగుచేశారు. అయితే ఈ యేడాది ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్ట పోయామని రైతులు వాపోతున్నారు. రబీలో వ్యవసాయ బోర్ల కింద తీగజాతి బూడిదగుమ్మడిని సాగుచేశారు. గతయేడాది మంచి లాభాలు రావడంతో, ఈ యేడాది కూడా ఆశించిన ధరలు ఉంటాయని ఎంతో భావించారు.
ఏసీఏ క్రికెట్ పోటీల్లో జిల్లా జట్టు విజయం సాధించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్సార్ స్టేడియంలో జిల్లా అం డర్-23 ఛాంపియనషి్ప పోటీల్లో శనివారం కడప జట్టుతో జిల్లా జట్టు తలపడింది.