Home » 2025
డీఎస్సీ ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టులకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారిని అనర్హులు చేసి, బీసీఏ అభ్యర్థులకు అర్హత ఇచ్చిన విషయంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది.
కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా స్కేటర్స్ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఆదివారం స్థానిక జేఎనటీయూ నుంచి శారదానగర్, కలెక్టరేట్, పూలే సర్కిల్, సప్తగిరి సర్కిల్, సుభాష్రోడ్డు మీదుగా టవర్క్లాక్ వరకు స్కేటింగ్ క్రీడాకారులు ఐదు కిలోమీటర్ల పాటు ర్యాలీ నిర్వహించారు.
మండలంలోని పోలేపల్లి బీసీ కాలనీలో తీవ్రమైన తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. గ్రామంలో ఆరు పంచాయతీ బోర్లు ఉండగా అందులో మూడు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన మూడు బోర్లలో భూగర్భజలాలు తగ్గడంతో నీరు తక్కువగా వస్తోంది. గ్రామంలోని బీసీకాలనీలో దాదా పు 200 ఇళ్ల వరకు ఉండగా వారికి తాగునీరే రావడం లేదు. వారు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి వ్యాన్లలో, ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చు కుంటున్నారు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భృతిని రూ. 20వేలకు పెంచి నందుకు టీడీపీ బెస్త సాధికార సమితి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీడీపీ బెస్త నాయకులు మేక చంద్రబాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కుళ్లాయప్ప, బెస్త సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు చేపల హరి తదితరులు ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎవరికి ఉపాధిని కల్పిస్తోందో తెలి యడం లేదు. కూలీలకు ఉపాధి దేవుడికి తెలియాకానీ, అక్రమార్కుల పా లిట కల్పతరువుగా మారింది. తాము చెప్పినట్లు వినకపోతే నాయకుల కు, అధికారులకు చెప్పి మిమ్మల్ని తొలగిస్తామని పలు గ్రామాలలో క్షేత్ర స్థాయి లో ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఈ ఒత్తిళ్లతో కొంత మంది పనులకు వెళ్లకున్నా వెళ్లినట్లు మస్టర్లలో పేర్లు ఎక్కించాల్సిన పరి స్థితి నెలకొందని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు చర్చించుకుంటున్నారు.
లారీ ఢీకొనడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని విద్యుత స్తంభం విరిగిపోయిం ది. దీంతో యా ర్డుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత సరఫరా నిలిచిపోయింది. శనివారం ఉదయం 11గంటల సమయంలో చీనీకాయల లోడింగ్ కోసం యార్డులోని చీనీ మార్కెట్లోకి లారీ వచ్చింది. లారీని రివర్స్ చేసే క్రమంలో విద్యుత స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగిపోయింది.
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత నసనకోట దుర్గమ్మ ఉత్సవాల ఏర్పాట్ల లో పాల్గొని శ్రమదానం చేశారు. నసనకోటలో వెలసిన దుర్గమ్మ ఉత్సవా లను చాలా సంవత్సరాల తరువాత నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున అబివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ నివారం సాయంత్రం లోక కల్యాణం కోసం లక్షపు ష్పార్చన కార్యక్రమాన్ని వై భవంగా నిర్వహించారు. కార్యక్రమానికి వైశ్య కుల గురువు పూజ్యశ్రీ వామనా శ్రమ స్వామీజీ హాజరై వాసవీమాతకు పుష్పార్చన చేశారు. అలాగే ఆలయ ఆ వరణలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక లలితా సహస్రనామావళితో లక్షపుష్పా ర్చన చేశారు.
ఉగ్రవాదం నశించాలి... హిందూ ముస్లిం బాయి.. బాయి అంటూ.... పహల్గాంలో ఉగ్రవాదుల దా డిని నిరసిస్తూ మాజీసైనికులు శనివారం నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వ హించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కెప్టెన షేకన్న ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది.
బెంగళూరు తన సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ను 11 పరుగుల తేడాతో ఓడించి మురిపించింది. హాజెల్వుడ్కు నాలుగు వికెట్లు, విరాట్ కోహ్లీ 70 పరుగులతో శుభారంభం చేశారు. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది