Home » Ananthapuram
అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.. వివరాల్లోకి వెళితే..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.నలుగురు విద్యార్థినులు వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.
పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో కదలిక వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫైర్ అయ్యారు. రూ. వెయ్యి పెంచేందుకు ఆయనకు ఐదేళ్లు పట్టింది.. అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారంటూ ఆయన దుయ్యబట్టారు.