Student Case.. వెలుగులోకి సంచలన నిజాలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 12:11 PM
Student case: అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసు బృందాలు కీలక ఆధారాలు సేకరించారు. గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Anantapuram: ఇంటర్ విద్యార్థిని (Inter student) హత్య తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థిని హత్య కేసు (Case)లో ముగ్గురు నిందితులను (Three Accused) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినిపై పెట్రోలు పోసి దుండగులు కాల్చి చంపారు. అనంతరం మృత దేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారు. వారం రోజుల క్రితమే విద్యార్థిని అదృశ్యమైంది. విద్యార్ధిని ఓ యువకుడితో స్కూటీపై వెళుతున్నట్లు సీసీ పుటేజీ (CCTV footage)లో పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.
విద్యార్థిని కేసుకు సంబంధించి పోలీసు బృందాలు రంగంలోకి దిగి పలు కీలక ఆధారాలు సేకరించారు. అదుపులోకి తీసుకున్న నిందితులను విచారిస్తున్నారు. తన్మయ అనే విద్యార్థిని రామకృష్ణ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పరిసర ప్రాంతాలలో దర్యాప్తు చేశారు. తెలిసినవాళ్లు, బంధువులను అడిగారు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో 4న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 7న కూడేరు మండలం గొట్కూరు సమీపంలో అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని శవం ఉందని పశువుల కాపరులు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన్మయి తల్లిదండ్రులు.. అక్కడికి చేరుకుని, మృతదేహం తమ కుమార్తెదేనని గుర్తించారు. కాగా యాసిడ్ వంటి ప్రమాదకర ద్రావణాన్ని ఆమెపై పోసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
గుర్తించలేని విధంగా ముఖం పూర్తిగా కాలి, ఉబ్బిపోయి ఉండడంతోపాటు శరీరంపై కాలిన గుర్తులతోపాటు పటు చోట్ల బొబ్బలు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశ పూర్వకంగానే దారుణంగా హింసించి చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని, బాలు అనే యువకుడు గతంలో వేధించాడని తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తన్మయి రాయదుర్గానికి చెందిన బాలు, అనంతపురం ఐదోరోడ్డులో ఉంటున్న నరేశ్, ఫెర్రర్నగర్కు దినేశ్తో స్నేహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటనపై రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం తనను షాక్కు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకు తావులేదని, ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. హత్యకు గురైన సోదరి తన్మయి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ భరోసా చేశారు.
ఇవి కూడా చదవండి:
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: వెంకయ్య నాయుడు
For More AP News and Telugu News