Gummanur Jayaram: మీడియాకు గుంతకల్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 29 , 2025 | 12:43 PM
Gummanur Jayaram: ‘‘నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. నా గురించి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. తప్పు చేస్తే సరిద్దుకుంటా. తప్పు చేయకుంటే తలఎత్తుకుని నిలబడతా’’ అంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

అనంతపురం, జనవరి 29: మీడియాపై గుంతకల్ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం (TDP MLA Gummanur Jayaram) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా ప్రతినిధులకు (media representatives) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ హెచ్చరించారు. తప్పు చేస్తే రాయాలని.. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తానన్నారు. భూ అక్రమాలు చేశానని చెబుతున్నారని.. వాటిని నిరూపించాలని.. లేకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా అని గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. ‘‘ మీడియా అంటే నాకేమీ లెక్కలేదు. అన్ని విధాలుగా చేసొచ్చా. రాస్కోండి. నేను తప్పు చేయను’’ అని స్పష్టం చేశారు.
‘‘తప్పు చేస్తే మాత్రం బహిరంగంగా నిలదీయండి. కానీ నేను తప్పు చేయకపోయినా.. నా తమ్ముడు తప్పు చేశాడు... ఇంకెవరో తప్పు చేశారని అనొద్దు. తప్పు చేస్తే నేరుగా అడగండి. తప్పు చేస్తే సరిదిద్దుకుంటాను కూడా. తప్పులు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఎవరైనా నాపై రాసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలి. నేను కబ్జా చేస్తే తలదించుతా.. చేయకపోతే తలఎత్తుతా’’ అంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మీడియాను ఉద్దేశించి గుంతకల్ ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. మీడియాపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
AP Govt Serious on Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం...
కాగా.. ఓ మీడియా సంస్థలో గుమ్మనూరు జయరాం, అతని కుటుంబసభ్యులకు సంబంధించి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. మీడియా ప్రతినిధులపై ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలు రాస్తే రైల్వే ట్రాక్పై పడుకోబెడతానని, ఖచ్చితంగా వార్తలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఏపీడబ్య్లూజే ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి మీడియా ప్రతినిధులను ఈ తరహాలో హెచ్చరించడం సరైన పద్దతి కాదన్నారు. మీడియాలో ఏదైనా వ్యతిరేక వార్తలు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని.. కానీ ఈ తరహాలో హెచ్చరికలు చేయడం ఏంటని మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు. ఓ మీడియాలో వచ్చిన వార్తలపై ఇలా హెచ్చరికలు అవసరం లేదని.. చట్టపరమైన చర్యలకు వెళ్లాలని.. రైలు పట్టాలపై పడుకోబెడతామని అనడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
Tirupati: తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదు.
ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం
Read Latest AP News And Telugu News