Chandra dandu : మట్టి తవ్వకాలను అడ్డుకున్న చంద్రదండు
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:41 AM
ఎ.కొండాపురం శివారులోని కొండప్రాంతంలో మట్టి తవ్వకాలను సర్పంచు వనజమ్మ ఆధ్వర్యంలో చంద్రదండు నాయకులు గురువారం అడ్డుకున్నారు. ఎక్స్కవేటర్లు, టిప్పర్లను నిలిపివేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ఎ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి గ్రామాల పరిధిలో కొండలు కనుమరుగు అవుతున్నాయని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్షనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తవ్వకాలు కొనసాగితే కొండ.....

అక్రమ తవ్వకాలపై ఆర్డీఓ ఆగ్రహం
పుట్లూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఎ.కొండాపురం శివారులోని కొండప్రాంతంలో మట్టి తవ్వకాలను సర్పంచు వనజమ్మ ఆధ్వర్యంలో చంద్రదండు నాయకులు గురువారం అడ్డుకున్నారు. ఎక్స్కవేటర్లు, టిప్పర్లను నిలిపివేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ఎ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి గ్రామాల పరిధిలో కొండలు కనుమరుగు అవుతున్నాయని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్షనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తవ్వకాలు కొనసాగితే కొండపై ఉన్న కొండమీదరాయుడు స్వామి కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలిమరలు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అనుమతుల పేరిట కొందరు ఇష్టానుసారం తవ్వుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని
ఆరోపించారు. మరికొందరు అక్రమంగా తవ్వుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. మట్టి తవ్వకాలకోసం ముందుగా గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయం సేకరించాల్సి ఉన్నా, అధికారులు పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దారు శేషారెడ్డి, ఎస్ఐ వెంకటనరసింహం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంట్రాక్టర్కు కేటాయించిన సర్వే నంబరును పరిశీలించారు. అనుమతులు లేనిచోట తవ్వుతుంటే ఏం చేస్తున్నారని సిబ్బందిపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటాయించినచోట మాత్రమే తవ్వుకోవాలని కాంట్రాక్టర్కు సూచించారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ తవ్వితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....