KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు

ABN , First Publish Date - 2024-10-29T09:34:54+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకొస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలకు కారణం కేసీఆర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కాళేశ్వరం కమిషన్‌కు రామగుండం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు సమర్పించారు.

KCR: కేసీఆర్‌కు బిగుస్తోన్న ఉచ్చు
KCR

కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌ నిర్మాణం.. స్థలాల ఎంపిక, బ్యారేజ్‌లో నీటి నిల్వ చేయడం.. నిల్వ పెంచడం వంటి కీలక నిర్ణయాలు అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఈ విషయాన్ని రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధించిన ఆధారాలను జస్టిస్ పీసీ ఘోష్‌తో కూడిన కమిషన్‌కు వెంకటేశ్వర్లు సమర్పించారు.

Updated Date - 2024-10-29T09:34:55+05:30 IST