Home » Vizag News
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం, నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివరాల్లోకి వెళితే..
రాజమండ్రిలో కల్తీ పాల మరణాలపై ఫోరెన్సిక్ ల్యాబ్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసులో ఐదుగురి మరణాలకు సంబంధించి తుది రిపోర్టును శనివారం అధికారులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యూట్యూబర్ కోమలి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్లోని మణికొండ చిత్రపురి కాలనీలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ హైకోర్టు, నాంపల్లి, విశాఖ కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్కి స్వల్ప ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు... రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు... ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలు... పది రోజుల పాటు సందడే సందడి...
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో నడిచే 4 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ బోగీలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 24వతేదీనుంచి నుంచి ఈ అదనపు ఏసీబోగీల ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
భోగాపురం ఎయిర్పోర్టు ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రకు మరో శుభవార్త అందింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడగా, జోన్ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది.
అరకులోయ ఏరియా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లేడీస్ బాత్రూమ్లో ఒక నవ జాతి శిశువు మృతదేహం తీవ్ర కలకలం రేపింది.
రైల్వే చార్జీల పెంపు స్వల్పంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెరిగిన చార్జీలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. కిలోమీటర్కు స్వల్పంగా (1 లేదా 2పైసల) పెంపు ఉన్నప్పటికీ, సబ్అర్బన్ ప్రయాణికులు, సీజన్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.