Home » Thopudurthi Prakash Reddy
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ‘చలో పేరూరు’ గొడవకు సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో అరెస్టు భయంతో ఆయన ముంబై వెళ్లినట్లు సమాచారం.
సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..
Toppudurthi Issue: ప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందోన్నది కింది స్థాయి పోలీసు సిబ్బంది మాట.
Case against Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పెద్ద షాకే తగిలింది. కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
ఏడాది క్రితం రామగిరి ఎంపీపీ మీనిగ నాగమ్మ అనారోగ్యంతో మరణించారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తిలో భారీగా బోగస్ ఓట్లు బయటపడ్డాయి.