Toppudurthi Issue: తోపుదుర్తిని తప్పిస్తున్నారా.. బయటపడ్డ పోలీసుల వైఫల్యం
ABN , Publish Date - May 03 , 2025 | 11:14 AM
Toppudurthi Issue: ప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందోన్నది కింది స్థాయి పోలీసు సిబ్బంది మాట.

శ్రీ సత్యసాయి జిల్లా, మే 3: సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం (Sri Sathya Sai district police) మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై (Former MLA of Raptadu Topudurthi Prakash Reddy) కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని.. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ కబుర్లు చెబుతూ మాజీ ఎమ్మెల్యేను పోలీసు ఉన్నతాధికారులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఇక్కడ సీన్ కట్ చేస్తే.. తోపుదుర్తి దర్జాగా హైదరాబాద్ రోడ్లపై పబ్లిక్గా తిరుగుతున్నారు. హైదరాబాద్లో పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్లపై తిరుగుతున్నట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సత్యసాయి జిల్లా పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు పబ్లిక్గా తిరుగుతున్నప్పటికీ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందన్నది కింది స్థాయి పోలీసు సిబ్బంది మాట. తూతూ మంత్రంగా తనిఖీలు.. బెయిల్ తెచ్చుకున్నంత వరకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీస్ అధికారుల వైఖరిపై ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె వర్గీయులు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై లేపేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన తోపుదుర్తి చందు విషయంలో కూడా పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. తోపుదుర్తి కుటుంబ సభ్యుల విషయంలో ఎందుకు పోలీసులు ఈ వైఖరి అవలంబిస్తున్నారన్నది టీడీపీ శ్రేణుల్లో హాట్హాట్గా చర్చ నడుస్తోంది.
Madhya Pradesh: 3 ఏళ్ల చిన్నారికి సంతారా.. పిన్న వయసులో ప్రపంచానికి వీడ్కోలు.. అసలేంటీ ఆచారం..
ఏం జరిగిందంటే
గత నెలలో రాప్తాడు నియోజకవర్గంలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. జగన్ పర్యటన సందర్భంగా కుంటిమద్ది వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. అయితే వందలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ నిర్వాహణ సరిగ్గా లేదని తోపుదుర్తి దృష్టికి డీఎస్పీ తీసుకెళ్లనిప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడమే కాకుండా.. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారని.. ఈ కారణంగా వందలాది మంది హెలీప్యాడ్ వద్దకు వచ్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. హెలిప్యాడ్ వద్ద కొంతమందిని ఉంచాలని చెప్పగా.. అదేమీ పట్టించుకోకుండా హెలీప్యాడ్ వద్దకు వందలాది మంది కార్యకర్తలు దూసుకొచ్చేలా చేశారని.. పోలీసులపైకి కార్యకర్తలను ఉసిగొల్పారంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం
Nara Lokesh: అమరావతి అన్స్టాపబుల్
Read Latest AP News And Telugu News