Home » Sri Satyasai
ఏడాదిన్నర కాలంలోనే నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని, రాబోయే రోజు ల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని తూముచెర్లలో బుధవారం ఆమె పర్యటించారు.
నకిలీ బంగారంతో మోసం చేయాలని చూసిన ముఠాను బ్యాంక్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించింది. సత్యసాయి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రముఖ సిమెంట్ కంపెనీల పేరుతో నకిలీ సిమెంట్ను సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యసాయి జిల్లాలో నకిలీ సిమెంట్ బాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు.
శ్రీసత్యసాయి జిల్లాలో జిల్లాలో జరిగిన రాబరీ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు వ్యక్తులు సూరత్ నుంచి బెంగుళూరుకు ఇన్నోవా కారులో తరలిస్తున్న హవాలా డబ్బును.. కొందరు దుండుగులు అడ్డుకుని కాజేశారు.
ఖర్జూర పండు విత్తనం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన 46 ఏళ్ల గంగాధర్ ఖర్జూరం తింటూ ఉండగా గింజ గొంతులో ఇరుక్కుంది. తర్వాత అది ఊపిరితిత్తులలోకి వెళ్లింది. దీంతో ఊపిరి ఆడక అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మార్మోగింది. పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. ప్రశాంతి నిలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హిల్వ్యూ స్టేడియంలో సాంస్కృతిక సంబరాలు అంబరాన్నంటాయి. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్వర్ణరథంపై సత్యసాయి బాబా చిత్రపటాన్ని ...
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బాబా శాంతి, ప్రేమ, స్వచ్ఛమైన సేవలకు ప్రతిరూపమని ప్రశంసించారు. కులం, మతం, ప్రాంతం, దేశాలకు అతీతంగా ఆయన మానవత్వాన్ని చాటిచెప్పారని అన్నారు.
జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ హామీ ఇచ్చారు. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహంలో జిల్లాలో రహదారుల ప్రగతిపై రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల ఏర్పాటుపై ఆరాతీశారు. ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, ...
రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ పేరుమీదుగా గుర్తుతెలియని వ్యక్తి నకిలీ ఫేస్బుక్ అకౌంట్ సృష్టించినట్టు తెలిసిందని రామగిరి పోలీసులు బుధవారం ప్రకటనలో తెలిపారు.
హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం ఆశించి మోసపోయానని నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు వాపోయాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉండడంతో వైద్యం చేయించడానికి హర్షసాయి ఫౌండేషన్ను పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేశాడు యువకుడు.