Share News

ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్

ABN , Publish Date - May 04 , 2025 | 09:17 AM

సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని..

ABN Effect: తోపుదుర్తి అరెస్టు విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్
Thopudurthi Prakash Reddy

శ్రీ సత్యసాయి జిల్లా: రాప్తాడు మాజీ ఎంఎల్ఏ (Ex MLA) తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Thopudurthi Prakash Reddy)ని అరెస్ట్ చేసే విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్ (DGP Office Serious) అయింది. అతనిని అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని డీజీపీ కార్యాలయం కోరింది. 20 రోజులుగా ప్రకాష్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడం వెనుక ఓ డీఎస్పీ, సీఐ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులకు శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు సమాచారం అందించారు. దీంతో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి.

Also Read: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు..


మరోవైపు కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్ద పోలీసులపై దాడి ఘటనలో కీలకంగా వ్యవహరించిన చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన 11 మంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో చెన్నేకొత్తపల్లి వైసీపీ జడ్పిటిసీ గోవిందరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్ర రెడ్డితో పాటు రామగిరి మండలానికి చెందిన పాపిరెడ్డి పల్లి, పోలేపల్లికి చెందిన ఓబిరెడ్డి , వెంకట రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. హెలిప్యాడ్ ఘటనలో పాల్గొన్న మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


సత్యసాయి జిల్లా పోలీసుల వైఫల్యం మరోసారి బయటపడింది. కుంటిమద్ది హెలిప్యాడ్‌లో జరిగిన ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ సికేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్.. తోపుదుర్తి ఇంటికి వెళ్లి సెర్చ్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. అయితే తోపుదుర్తి అజ్ఞాతంలో ఉన్నారని.. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ కబుర్లు చెబుతూ మాజీ ఎమ్మెల్యేను పోలీసు ఉన్నతాధికారులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఇక్కడ సీన్ కట్ చేస్తే.. తోపుదుర్తి దర్జాగా హైదరాబాద్ రోడ్లపై పబ్లిక్‌గా తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో పబ్లిక్‌గా తిరుగుతున్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపై తిరుగుతున్నట్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో సత్యసాయి జిల్లా పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు పబ్లిక్‌గా తిరుగుతున్నప్పటికీ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. పోలీసు ఉన్నతాధికారుల డైరెక్షన్‌లోనే తోపుదుర్తి వ్యవహారం నడుస్తోందన్నది కింది స్థాయి పోలీసు సిబ్బంది మాట. తూతూ మంత్రంగా తనిఖీలు.. బెయిల్ తెచ్చుకున్నంత వరకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీస్ అధికారుల వైఖరిపై ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె వర్గీయులు ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై లేపేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన తోపుదుర్తి చందు విషయంలో కూడా పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. తోపుదుర్తి కుటుంబ సభ్యుల విషయంలో ఎందుకు పోలీసులు ఈ వైఖరి అవలంబిస్తున్నారన్నది టీడీపీ శ్రేణుల్లో హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

భార్యా భర్తలపై కర్రలతో దాడి..

మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..

For More AP News and Telugu News

Updated Date - May 04 , 2025 | 09:17 AM