Home » Suspension
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీ నుంచి అధిష్టానం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది. దీనిపై స్పందించిన ఆయన ఏమన్నారంటే..
వృత్తివిద్యా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన సీఈటీ పరీక్షలు రాసేందుకు వెళ్లిన విద్యార్థుల జంధ్యం తొలగించాలని ఆంక్షలు విధించిన వ్యవహారంపై జిల్లా అధికారి గురుదత్త హెగ్డే స్పందించారు.
సినీనటి కాదంబరి జెత్వానీని అక్రమంగా బంధించి, తప్పుడు కేసుతో వేధించిన వ్యవహారంలో నిఘా విభాగం మాజీ అధిపతి పీఎ్సఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాతా, మాజీ డీసీపీ విశాల్ గున్నీ సస్పెన్షన్ను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది.
ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఫిజియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉమామహేష్ సస్పెండయ్యారు.
గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి తిరుపతి ఎఫ్ఏసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)గా వ్యవహరిస్తున్న సీహెచ్ హరిబాబును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు.
తన సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు, ఓ ఎన్నారై వద్ద కారు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్కు గురయ్యారు.
ఎన్నికల స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు
ఖమ్మం జిల్లాలో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ప్రదానోపాధ్యాయులు(హెచ్ఎం)పై సస్పెన్షన్ వేటు పడింది.
‘‘ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిర్వహిస్తున్న ఉద్యమానికి అండగా నిలిచిన ఉపాధ్యాయుడిని ప్రభుత్వం దుర్మార్గంగా సస్పెండ్ చేసింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా?’