Home » Shashi Tharoor
హై రేంజ్ రూరల్ డవలప్మెంట్ సొసైటీ (హెచ్ఆర్డీఎస్) అనే సంస్థ 'ది వీర్ సర్కర్ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవార్డ్ -2025'ను నెలకొల్పింది. తొలి అవార్డు గ్రహీతగా శశిథరూర్ పేరును ప్రకటించింది.
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
థరూర్ స్వరాష్టమైన కేరళలో వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయన ఒకవేళ కాంగ్రెస్కు ఉద్వాసన చెప్పాలనుకుంటే ఎన్నికలకు ముందే ఆపని చేయాల్సి ఉంటుంది.
నరేంద్ర మోదీ నుంచి నిన్నమొన్న ఎల్కే అడ్వాణీ వరకూ పలు సందర్భాల్లో సానుకూల వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసారి ఆసక్తికర పోస్ట్ చేశారు.
మెకాలే 200 సంవత్సరాల 'బానిస మనసత్వ' వారసత్వాన్ని తొలగించాలని ప్రధాని తన ప్రసంగంలో కీలకంగా పేర్కొన్నారు. భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను పునరుద్ధరించేందుకు పదేళ్ల నేషనల్ మిషన్ కోసం విజ్ఞప్తి చేశారు.
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
ఆడ్వాణీ బర్త్డే పోస్టులో ఆయనను తాను కలిసినప్పటి పాత ఫోటోను శశిథరూర్ పోస్ట్ చేశారు. నవీన భారతదేశ జర్నీలో ఆడ్వాణీ సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న చెక్కుచెదరని సంకల్పం, వినయం, మర్యాద శ్లాఘనీయమని పేర్కొన్నారు.
గాజా శాంతి సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈజిప్టు అధ్యక్షుడు వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అయితే నరేంద్ర మోదీ ఈ సదస్సుకు దూరంగా ఉండేందుకే నిశ్చయించుకున్నారు.
ట్రంప్ సుంకాల ప్రభావం కారణంగా భారత్లో ఇప్పటికే ఉద్యోగాల కోతలు మొదలయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు. భారత్ తన ఎగుమతులను మరిన్ని దేశాలకు విస్తరించాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థను మూలాల నుంచి బలోపేతం చేయాలని అన్నారు.
ట్రంప్ పాదరసం వంటి స్వభావం కలిగిన వ్యక్తి అని శశిథరూర్ అభివర్ణించారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలానే ఉన్నాయని, ఆయన మాట్లాడిన మాటలు పలువురిని గాయపరిచాయని, 50 శాతం టారిఫ్ ప్రభావం ఇప్పటికే మనపై పడిందని వ్యాఖ్యానించారు.