Home » Old City
మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇవాళ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
దేశ వారసత్వ సంపద వెలకట్టలేని ఆస్తి. పురాతన కట్టడాలు ఎక్కడున్నా వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతో ఉంది. దీనిని అక్షరాలా అమలు చేశారు హైదరాబాద్ సీపీ.. సీవీ ఆనంద్.
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
ఓల్డ్ సిటీలో యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై స్థానికులు తిరగబడ్డారు. మౌలా కా చిల్లా ప్రాంతంలో నాలా పనులు పెండింగ్లో ఉండటంతో తమ ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని గతంలో ఎమ్మెల్యేకు స్థానికులు ఫిర్యాదులు చేశారు.
మన ప్రభుత్వ వ్యవస్థల్లోని నిలువెత్తు నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని కళ్లకు కట్టేలా చెబుతున్నారు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదపు బాధిత కుటుంబ సభ్యులు. వాళ్లు చెబుతున్న షాకింగ్ నిజాలు నిర్ఘాంత పరిచేలా ఉన్నాయి.
KTR: రేవంత్ ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. వేసవి నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.
Gulzar House Fire Incident: పాతబస్తీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉత్కర్ష్ మోదీ ఇచ్చిన ఫిర్యాదు కేసు ఫైల్ అయ్యింది.
సెల్లార్ దగ్గరున్న కింద మెట్ల పక్కనే భారీగా మంటలు వస్తూ ఉండడంతో బయటికి వెళ్లలేక కుటుంబసభ్యులంతా టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, టెర్రస్ పైన ఉన్న కార్మికులు మెట్ల ద్వారానికి తాళం వేయడంతో ప్రమాదం నుంచి ఇక, ఏ మాత్రం తప్పించుకునే అవకాశం లేకపోయింది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్నిప్రమాద బాధితులకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.